తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేటీఆర్ ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ ఎన్నికల ప్రధాన అధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు 

  • కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగా సంపాదించారన్న కేటీఆర్
  • కాంగ్రెస్ నేతలు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు తమకే వేయాలని కేటీఆర్ పిలుపు
  • కేటీఆర్ వ్యాఖ్యలను సీఈసీ దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి
Congress complains to CEC against KTR

తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డబ్బు తీసుకుని ఓటేయాలంటూ కేటీఆర్ ప్రజలకు సూచిస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరకు కాంగ్రెస్ నేత వేణుగోపాలస్వామి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 

కాంగ్రెస్ నేతలు స్కాంలు చేసి బాగానే సంపాదించారని, ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతారని, కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, ఓటు మాత్రం బీఆర్ఎస్ కే వేయాలని కేటీఆర్ ఇటీవల ఓ సభలో పిలుపునిచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని వేణుగోపాలస్వామి పేర్కొన్నారు. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ ను కోరారు. కేటీఆర్ పై  ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోతే, తాము కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.

Related posts

ప్రధాని మోదీని కలుస్తానని కిషన్ రెడ్డిని అడిగాను: రేవంత్ రెడ్డి

Ram Narayana

ఖమ్మం ,హైద్రాబాద్ ,కరీంనగర్ ఎంపీ సీట్లపై రేపే కాంగ్రెస్ కీలక నిర్ణయం …!

Ram Narayana

మంత్రి పొంగులేటి నివాసానికి దీపాదాస్ మున్షీ…

Ram Narayana