Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

రాష్ట్ర రెవిన్యూ ,గ్రహనిర్మాణం , సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సోమవారం ఉదయం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు …సీఎం కు బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు …పొంగులేటి వెంట డీసీసీబీ మాజీ అధ్యక్షులు మువ్వా విజయబాబు కూడా సీఎం ను కలిశారు …..పొంగులేటి అక్కడ నుంచి నేరుగా కల్లూరు మండలం నారాయణపురం లోని తన స్వగృహానికి చేరుకొని అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు …పార్టీ కార్యకర్తలను ,అభిమానులను కలిశారు …

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తండ్రి పొంగులేటి రాఘవ రెడ్డి ఆరో సంవత్సరీకాన్ని స్వగ్రామం కల్లూరు మండలం నారాయణపురంలో సోమవారం నిర్వహించారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సమాధి వద్ద కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీలక్ష్మి దంపతులతో పాటు రాఘవరెడ్డి సతీమణి స్వరాజ్యం, ఇతర కుటుంబ సభ్యులు సమాధి వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతో కలిసి భోజనాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మువ్వా విజయబాబు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లాలో మంగళవారం పర్యటిస్తారని క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 08:30గంటలకు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో, ఉదయం 09:45 గంటలకు తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ఉదయం 11 గంటలకు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో మార్కెట్ యార్డు, జేఎన్టీయూ కళాశాల స్థలాలను పరిశీలిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. తిరిగి మధ్యాహ్నం 2:45 గంటలకు మంగాపురం తండాలో, సాయంత్రం 4:30 గంటలకు కూసుమంచి మండలం ముత్యాలగూడెంలో జరిగే ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొంటారని దయాకర్ రెడ్డి తెలిపారు.

ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేట్ అధికారులు, సిబ్బంది తదితరులు నూతన శుభాకాంక్షలను తెలిపారు. కల్లూరు లోని నారాయణ పురంలో కొందరు, ఖమ్మం లోని క్యాంప్ కార్యాలయంలో మరికొందరు కలిసి పుష్ప గుచ్ఛాలు, పూలమొక్కలు, మెమొంటోలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాజీ సీఎం కేసీఆర్

Ram Narayana

‘తన్నులాట’ గురించి ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పలేరు: రేవంత్‌రెడ్డి

Drukpadam

బీజేపీలో గందరగోళం…కొత్తగా వచ్చిన వారిని నిలబెట్టుకునేందుకు పదవుల పందారం …

Drukpadam

Leave a Comment