Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జర్నలిస్టులకు ,సీనియర్ సిటిజన్స్ కు రైల్వే ప్రయాణంపై రాయితీ ఇక లేనట్లే …!

కేంద్రప్రభుత్వం రైల్వే ప్రయాణాల్లో జర్నలిస్టులకు ,సీనియర్ సిటిజన్లకు ఇస్తున్న రాయితీని కరోనా సమయంలో నిలిపి వేసింది …కరోనా అయిపోయిన తర్వాత జర్నలిస్టులకు ,సీనియర్ సిటిజన్లు తమ రాయితీని పునరుద్దరించాలని అనేక సార్లు రైల్వే మంత్రికి , ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు …మొమోరాండాలు ఇచ్చారు …అనేక సంవత్సరాలుగా ఇస్తున్న రాయితీలను నిలిపి వేయడంపట్ల జర్నలిస్టులు , సీనియర్ సిటిజన్లు గుర్రుగా ఉన్నారు …ఉన్నపథకాలను కొనసాగిస్తూ ,మరిన్ని రాయితీలు కల్పించాల్సిన పాలకులు ఉన్న రాయితీలను తొలగించడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు …రైల్వే మంత్రి రాయితీలపై మాట్లాడుతూ ప్రతి ప్రయాణికుడికి 55 రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించడం విడ్డురంగా ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…

అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంత భాగం 2026 నాటికి పూర్తవుతుందని వెల్లడించారు. గుజరాత్‌లో జరుగుతోన్న వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… సూరత్ నుంచి బిలిమోరా వరకు 35 కిలో మీటర్ల దూరం సిద్ధమవుతుందన్నారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

అయితే ఈ ప్రాజెక్టు కచ్చితంగా ఎప్పుడు పూర్తవుతుందో ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్సుపోర్ట్ హబ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చునని సూచించారు. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలోనూ భూసేకరణ దాదాపు పూర్తయిందన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు.

ప్రయాణికులకు 55 శాతం రాయితీ వస్తోంది

రైలులో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు 55 శాతం రాయితీ సౌకర్యాన్ని పొందుతున్నారని అశ్వినీ వైష్ణవ్ అన్నారు. సీనియర్ సిటిజన్లకు, మీడియా ప్రతినిధులకు కరోనా ముందునాటి రాయితీని పునఃప్రారంభించాలని వస్తున్న డిమాండ్లపై మంత్రిని ప్రశ్నించగా.. దానికి సూటిగా సమాధానం చెప్పకుండా ఆయనలా పేర్కొన్నారు. ఇప్పటికే భారతీయ రైల్వే ప్రతి ప్రయాణికుడికి వారి ప్రయాణంపై 55 శాతం తక్కువకే ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందన్నారు. అంటే ఒకచోటు నుంచి మరో చోటుకి టికెట్ ధర 100 రూపాయలు అనుకుంటే, రైల్వేస్ కేవలం 45 రూపాయలే చార్జ్ చేస్తోందని, తద్వారా ప్రతి ప్రయాణికుడికీ 55 శాతం రాయితీ వస్తున్నట్టేనని మంత్రి సూత్రీకరించారు. 

Related posts

తెలంగాణ‌లో గూగుల్‌, యూట్యూబ్ ప్ర‌క‌ట‌న‌ల్లో బీజేపీ టాప్

Ram Narayana

ఒరిగిపోతున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం!

Drukpadam

కర్ణాటక రాజకీయాల్లో సంచలనం…!

Drukpadam

Leave a Comment