ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రెస్పెక్టెడ్ సర్… అంటూ సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ లేఖ

  • ఏపీలో కుల గణన
  • ఎన్నికల సమయంలోనే ఎందుకు అంటూ పవన్ లేఖాస్త్రం
  • సీఎం జగన్ కు 12 ప్రశ్నలు సంధించిన జనసేనాని
  • జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంటూ స్పష్టీకరణ

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏపీ సీఎం జగన్ కు లేఖాస్త్రం సంధించారు. రెస్పెక్టెడ్ సర్ అంటూ సీఎం జగన్ ను సంబోధించారు. మీ రాజ్యాంగేతర వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కులగణన పేరిట సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోంది… అందుకే ఈ లేఖ రాస్తున్నానంటూ పవన్ స్పష్టం చేశారు. అందుకే ప్రజల తరఫున జనసేన పార్టీ మీకు కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది… దయచేసి స్పందించండి అని కోరారు. 

అయితే, వ్యక్తిగత దూషణలకు పోకుండా, సంబంధిత ప్రశ్నలకు జవాబులు ఇస్తారని ఆశిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు. ఇక తన లేఖకు ఎన్నికల వేళ కుల గణన ఎందుకు? అనే హెడ్డింగ్ పెట్టారు. ఇందులో 12 ప్రశ్నాస్త్రాలు సంధించారు. వీటన్నింటికీ గౌరనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని స్పష్టం చేశారు.

Related posts

పల్నాడు పర్యటనలో కూటమి సర్కార్ పై జగన్ ఫైర్ …

Ram Narayana

గెలిచాక కుటుంబంలో అందరికీ పదవులు ఇవ్వాలంటే ఎలా?: షర్మిలకు పేర్ని నాని కౌంటర్

Ram Narayana

వైసీపీకి జగ్గంపేట ఎమ్మెల్యే చంటిబాబు గుడ్ బై టీడీపీలో చేరికకు రంగం సిద్ధం …!

Ram Narayana