Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల చేసిన కాంగ్రెస్‌…కులగణన చేస్తామని హామీ

కాంగ్రెస్ శుక్రవారం ‘న్యాయ్ పాత్ర’ పేరుతో త‌న ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ మెనిఫెస్టోను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను హ‌స్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం త‌దిత‌ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున రెండు ‘మేనిఫెస్టో లాంచ్ మెగా ర్యాలీలను’ నిర్వహించనుంది.

అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 25 హామీలను వెల్లడించిన విష‌యం తెలిసిందే. దీనిని ‘పాంచ్ న్యాయ్’ లేదా న్యాయానికి ఐదు స్తంభాలు అని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ఈ ఐదు స్తంభాల‌లో ఒక్కొక్క దాని కింద ఐదు ‘గ్యారంటీలు’ ఉన్నాయి. ‘యువ న్యాయ్’ (యువతకు), ‘నారీ న్యాయ్’ (మహిళలకు), ‘కిసాన్ న్యాయ్’ (రైతుల కోసం), ‘శ్రామిక్ న్యాయ్’ (కార్మికులకు) మరియు ‘హిస్సేదారి న్యాయ్’ (జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు).

మెనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గే మాట్లాడుతూ.. మోదీ పాల‌న‌లో అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామ‌న్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కులగ‌ణన చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే పేద మ‌హిళ‌ల‌కు ఏడాదికి రూ. ల‌క్ష అందిస్తామ‌ని తెలిపారు. కిసాన్ న్యాయ్ పేరుతో రైతుల‌ను ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుకువ‌స్తామ‌న్నారు.

Related posts

 విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే… ప్రతిపాదించిన మమతా బెనర్జీ

Ram Narayana

రాహుల్ గాంధీ మరో యాత్ర.. ‘భారత్ న్యాయ్ యాత్ర’ పేరుతో మణిపూర్ టు ముంబై

Ram Narayana

మా కూటమి పేరు ‘భారత్’ అని పెట్టుకుంటే దేశం పేరును బీజేపీగా మారుస్తారా?: కేజ్రీవాల్

Ram Narayana

Leave a Comment