ఖమ్మం వార్తలు

డీప్‌ఫేక్‌ ఆడియోల ద్వారా తనపై అసత్య ప్రచారం… మండిపడ్డ మాజీమంత్రి అజయ్

డీప్‌ఫేక్‌ ఆడియోలు సమాజానికి పెను ముప్పుగా మారుతున్నాయని ఇవి సమాజంలో గందరగోళానికి కారణమవుతున్నాయి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆందోళన వ్యక్తం చేశారు…గత కొంత కాలంగా తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారని, గత ఎన్నికల తరుణంలో కూడా ఇదే మాదిరిగా.. ఇప్పుడు కూడా కొందరు ఆగంతకులు తను మాట్లాడినట్టుగా ఓ డీప్‌ఫేక్‌ ఆడియోను సృష్టించారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ విధమైన జరుగుతున్న దుష్ప్రచారం చేసే వారిపై చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు…ఇటువంటి డీప్‌ఫేక్‌ ఆడియోలపై ప్రజలకు మీడియా వారు అవగాహన కల్పించాలని కానీ కొన్ని దినపత్రికలు దురుద్దేశపూర్వకంగా వాటిని ప్రజల్లో నిజం అని మైమరిపించేలా తప్పుడు ప్రచురణ చేస్తున్నారని దీన్ని పువ్వాడ తీవ్రంగా ఖండించారు.

వీటిని సృష్టించడానికి కృత్రిమ మేధను ఉపయోగించడం ద్వారా ప్రమాదం పొంచి ఉన్నదని, సమస్యాత్మకమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

Related posts

బడికి రాని విద్యార్థి.. ఇంటి ముందు టీచర్లు, విద్యార్థుల ధర్నా!

Ram Narayana

ఖమ్మం నగరానికి నాలుగు దిక్కులా ఖబరస్థాన్ ల ఏర్పాటుకు చర్యలు… మంత్రి తుమ్మల

Ram Narayana

ఖమ్మంలో తుమ్మల వర్సెస్ పువ్వాడ నామినేషన్ లొల్లి…

Ram Narayana