Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

గెలిపించే భాద్యత మీది …పనిచేసే భాద్యత నాది …నామ

ఖమ్మం లోకసభ పరిధిలోనే ప్రజల దీవెనలతో రెండుసార్లు పార్లమెంట్ కు ఎన్నికైయ్యాను …నా పనితీరు మీరు చూశారు …ఎంపీగా తన భాద్యత సమర్థవంతంగా నిర్వర్తించానని ఉత్తమ పార్లమెంట్ కు కూడా నన్ను ఎంపిక చేశారు ..ఈ క్రెడిట్ కచ్చితంగా ఖమ్మం ప్రజలదే …ఈసారి తిరిగి పోటీచేస్తున్నాను …నన్ను గెలిపించే భాద్యత మీది …పనిచేసే భాద్యత నాది …మీ పార్లమెంట్ సభ్యుడిగా మంచి పేరు తెస్తానని అందుకు పార్టీలకు అతీతంగా తనకు సహకరించేందుకు ముందుకు వస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ఖమ్మం పార్లమెంట్ కు బీఆర్ యస్ తరుపున పోటీచేస్తున్న నామ నాగేశ్వరరావు అన్నారు …శనివారం ఖమ్మం బీఆర్ యస్ భవనంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు తాతా మధు , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నామ మాట్లాడుతూ తన ప్రచారంలో సహకరించిన ప్రజలకు మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ..హోరాహోరీగా జరుగుతున్నా ఈ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ..ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉన్నా, ప్రజలు ఎవరిని గెలిపించాలని అనుకుంటే వారిని గెలిపించి తీరుతారని పేర్కొన్నారు …2018 తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ను మంచి మెజార్టీతో గెలిపించిన ప్రజలే , 2019 పార్లమెంట్ ఎన్నికల్లో వేరే ఆలోచనలు చేశారని గుర్తు చేశారు …అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలకు తగ్గట్లుగా పరిపాలన సాగించడంలేదని ప్రతిపక్షాలుగా మేము కాదు ప్రజలు అభిప్రాయపడుతున్నారని నామ అన్నారు ..మంచినీళ్లు కూడా అందివ్వలేక పోతుందని , కరెంటు కోతలు అధికమైయ్యాయని ప్రజల్లో చిరాకు ఉందని కేసీఆర్ ప్రభుత్వంతో పోల్చుకొని అదే బెటర్ అంటున్నారని నామ పేర్కొన్నారు …

పార్లమెంట్ లో తన గొంతును ప్రజాగొంతుకగా ఉపయోగించని నిత్యం ప్రజల సమస్యల పరిస్కారం కోసం గళం విప్పాను …అనేక సందర్భాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాను తనకు అవకాశం ఇస్తే మరింత సేవ చేస్తాను …మీవాడిగా ,స్థానికుడిగా అందుబాటులో ఉంటానని నామ అన్నారు ..ఖమ్మం జిల్లాలో అనేక హైవేలు తెచ్చాను …తమ తండ్రిగారైన నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు చేశాము …కొత్తగూడెం -కొవ్వూరు రైల్వే లైన్ సత్తుపల్లి వరకు పూర్తీ చేశానని నామ తెలిపారు …

మీడియా సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ పార్లమెంట్ లో ప్రజల సమస్యలపై పోరాడే నామ నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు …బీసీ బిడ్డనైనా తనకు కేసీఆర్ రాజ్యసభ ఇచ్చి బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని అందువల్ల బీసీ సోదరులు నామకు ఓటు వేసి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని పిలుపు నిచ్చారు ..

కాంగ్రెస్ ను ఓడించాలంటే ఖమ్మంలో నామకు మద్దతు ఇవ్వాలి మంద కృష్ణకు సండ్ర సలహా …

కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని ,ఆపార్టీని ఓడించడమే తన లక్ష్యమని చెపుతున్న మందకృష్ణ ఖమ్మంలో బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ ను ఓడించేందుకు బలమైన అభ్యర్థిగా ఉన్నా నామకు మద్దతు ఇవ్వాలని సలహా ఇచ్చారు …లేకపోతె మందకృష్ణ లక్ష్యం నెరవేరదని పేర్కొన్నారు …అందువల్ల మందకృష్ణ ఈ విషయంలో పునరాలోచన చేయాలన్నారు …మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధు , జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు ,డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బిచ్చాల తిరుమలరావు , బొమ్మెర రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు …

Related posts

ఖమ్మంలో ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు …హోరెత్తిన సంబరాలు

Ram Narayana

ఖమ్మం జిల్లాలో మదన్ లాల్ ఇన్ రాములు నాయక్ అవుట్ …

Ram Narayana

నామ గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు..హరీష్ రావు

Ram Narayana

Leave a Comment