Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత :కేంద్రం

విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత :కేంద్రం
-వారంతా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించాలి: కేంద్రం
-విదేశాలకు వెళ్లాలనుకునే వారిని అనుసంధానం తప్పనిసరి
-రెండు డోసుల మధ్య విరామం తగ్గింపునకు అనుమతి
-28రోజుల తర్వాత కొవిషీల్డ్‌ రెండో డోసుల తీసుకోవచ్చని స్పష్టం

విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్‌ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్‌ ఆధారిత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వ తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే తొలి డోసు తీసుకున్నవారు 28 రోజుల తర్వాత కొవిషీల్డ్‌ రెండో డోసు తీసుకునేందుకు అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశించింది. కొవిడ్‌ షీల్డ్‌ రెండు డోసుల మధ్య విరామాన్ని 84 రోజుల వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే, విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపునిచ్చింది.

అనుసంధాన ప్రక్రియలో వ్యాక్సిన్‌ రకం అనే ఆప్షన్‌ దగ్గర కొవిషీల్డ్‌ అని పెడితే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేస్తోన్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్‌ అనుమతి ఉందని స్పష్టం చేసింది.

Related posts

భారత్ లో అత్యంత చవకైన కరోనా వ్యాక్సిన్ కోర్బెవాక్స్ !

Drukpadam

చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్!

Drukpadam

కేంద్రం అవలంబిస్తున్న వ్యాక్సినేషన్ విధానం లోపభూయిష్టం : అసదుద్దీన్ ఒవైసీ…

Drukpadam

Leave a Comment