Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసింది, కానీ…: జేడీయూ

  • నితీశ్ కుమార్ ఆఫర్‌ను తిరస్కరించారన్న జేడీయూ
  • ప్రస్తుతం తాము ఎన్డీయేలోనే కొనసాగుతున్నట్లు స్పష్టీకరణ
  • జేడీయూ నేత త్యాగి వెల్లడి

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లుగా జేడీయూ వర్గాలు వెల్లడించాయి. అయితే నితీశ్ కుమార్ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

నితీశ్ కుమార్‌కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని, ఆయన మాత్రం తిరస్కరించారని తెలిపారు. ఈ విషయమై ఇండియా కూటమి నేతలు… తమ అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ ప్రస్తుతం తాము ఎన్డీయేలో ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. త్యాగి వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండి కూటమి సంప్రదించడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసునని చురక అంటించింది.

Related posts

పార్లమెంట్ సమావేశాలు ఎందుకు పెడుతున్నారో చెప్పండి … ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ…!

Ram Narayana

‘ఇండియా’ కూటమి రథ సారథిగా మల్లికార్జున ఖర్గే!

Ram Narayana

పార్లమెంట్ లో తెలంగాణ గొప్పతనాన్నికేసీఆర్ దార్శనికతను చాటిచెప్పిన నామ …

Ram Narayana

Leave a Comment