Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

యూపీలో 11 నుంచి కాంగ్రెస్ ధన్యవాద్ యాత్ర…

  • యూపీలో బీజేపీకి మించి సీట్లు గెలుచుకున్న ఇండియా కూటమి
  • తమను ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయం
  • మొత్తం 403 నియోజకవర్గాల్లోనూ యాత్ర

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ పార్టీ.. తమను అక్కున చేర్చుకున్న యూపీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల్లో ‘ధన్యవాద్ యాత్ర’ చేపట్టాలని నిర్ణయించింది. సీనియర్ నేతలు, కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొంటారని సమాచారం. 

ఈ యాత్ర సందర్భంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించి గౌరవిస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకోగా, మిత్రపక్ష సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.

Related posts

ఇదేం న్యాయం… అయోధ్యలో కార్యక్రమం జరుగుతుంటే అసోంలో రాహుల్ గాంధీ గుడికి వెళ్లకూడదా?: షర్మిల 

Ram Narayana

అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోరీలాల్ శర్మ …గాంధీయేతర కుటుంబం నుంచి మొదటి వ్యక్తి …

Ram Narayana

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషలు ఎత్తివేసే కుట్ర …సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ..

Ram Narayana

Leave a Comment