Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఇక పాలనపై ద్రుష్టి …సీతారామప్రాజెక్టు పరిశీలనకు ముగ్గురు మంత్రులు…

నిన్నమొన్నటివరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ తో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి…దాదాపు రెండు నెలలు కోడ్ తో ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకోలేని పరిస్థితి …ఎట్టకేలకు ఎన్నికలు ముగిశాయి…కోడ్ ఎత్తివేశారు …ఇక పాలపై ద్రుష్టి పెట్టిన తెలంగాణ సర్కార్ వరుస భేటీలు సమీక్షలతో తీరికలేకుండా ఉంటుంది …మంత్రులు పరుగులు పెడుతున్నారు…ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఉన్న సీతారామ ప్రాజెక్ట్ పూర్తీ చేయడం ద్వారా జిల్లను సస్యశ్యామలం చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రాజెక్ట్ పనులను వేగిరం చేసింది …ఇప్పటికే పూర్తీ కావచ్చిన సీతారామ పనులను పరిశీలించి సమీక్షా చేసి పూర్తీ చేసేందుకు ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా త్వరలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు …అందుకోసం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు రేపు ,ఎల్లుండి జిల్లాలో పర్యటించనున్నారు …

డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు ఖమ్మంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 12, 13న మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సాగునీటి ప్రాజెక్టుల పనుల పరిశీలన, అధికారులతో సమీక్షతో పాటు అభివ్రుద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పాలనపై ప్రత్యేక ద్రుష్టి సారించిన డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క మల్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సీతరామ ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగు నీరు ఇవ్వాలన్న సంకల్పంతో ఇప్పటికే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డితో కలిసి పలు మార్లు రాష్ట్ర సచివాలయంలో సమీక్షలు నిర్వహించారు. కాగా వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రాజెక్టును ఈ నెల 13న మంత్రులతో కలిసి సందర్శిస్తారు. అధికారులు కాగితాల్లో చూపించిన పురోగతి, వాస్తవ స్థితిని పరిశీలించిన ఆనంతరం అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి త్వరితగతిన ప్రాజెక్టు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి దశ దిశ నిర్దేశం చేయనున్నారు. పట్టువదలని విక్రమార్కుడిగా ఇందిరా, రాజీవ్ సాగర్ (సీతరామ) ప్రాజెక్టులను పూర్తి చేయడానికి భట్టి చాల పట్టుదలతో ముందుకు సాగుతున్న నేపత్యంలో అధికారులు సైతం ఇందుకు తగ్గట్గుగా మంత్రుల పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశారు.

పర్యటన సాగుతుందీలా:

రెండు రోజుల పాటు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఇలా పర్యటిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల పుణ ప్రారంభం సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం ఎన్ ఎస్ పి క్యాంపు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేయనున్నారు. ఆతరువాత ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, విద్య, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో శాఖల వారీగా సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 3 30 గంటలకు మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం-పుట్టకోట, పాతర్లపాడు- గోవిందపురం గ్రామాల మధ్యన పంచాయతీరాజ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 13న ఖమ్మం నుంచి ఉదయం 8.30 గంటలకు సీతరామ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతారు. ఉదయం 10గంటలకు దుమ్ముగూడెంకు చేరుకొని సీతరామ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. సీతరామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ రెగ్యూలేటర్, ఆశ్వారావుపేట మండలం బిజి కొత్తూర్లోని పంప్ హౌజ్, కెనాల్, ముల్కలపల్లి మండలం పంప్ హౌజ్-2, కమలపురం మండలం పూసుగూడెం లోని పంప్ హౌజ్-3, కెనాల్స్ పనులను పరిశీలిస్తారు. అలాగే కమలపురం వయా పాల్వంచ, కొత్తగూడెం, జూలూరుపాడు మీదుగా ఎన్కూర్ లింక్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు.

Related posts

జూపల్లి ప్రమేయంతోనే మా నాయకుడి హత్య… రేవంత్ రెడ్డి ఆయనను బర్తరఫ్ చేయాలి: కేటీఆర్

Ram Narayana

కేసీఆర్.. నిన్ను దేవుడు అందుకే పుట్టించాడని అన్నావు కదా?: కిషన్ రెడ్డి

Ram Narayana

 టీఎస్ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం

Ram Narayana

Leave a Comment