Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

డీఎస్ లేని లోటు ఎవరూ తీర్చలేరు: సీఎం రేవంత్ రెడ్డి

  • నిన్న హైదరాబాదులో కన్నుమూసిన డీఎస్
  • నేడు నిజామాబాద్ లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
  • డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. 76 ఏళ్ల డీఎస్ నిన్న వేకువ జామున హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఇవాళ అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు నిజామాబాద్ లో నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో, సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ లో డీఎస్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. డీఎస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్ తనయులు సంజయ్, ఎంపీ అర్వింద్ లతో మాట్లాడారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

డీఎస్ లేని లోటును ఎవరూ తీర్చలేరని అన్నారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకాలుగా సేవలు అందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో డీఎస్ పాత్ర కీలకం అని పేర్కొన్నారు. డీఎస్ కుటుంబానికి తమ సహాయ సహకారాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోరుతూ ఆగస్టు 9న చలో హైదరాబాద్….

Ram Narayana

సీఎం కెసిఆర్ జోలికొస్తే నీ నాలిక చీరేస్తాం..పొంగులేటిపై ఎమ్మెల్సీ మధు ఫైర్

Ram Narayana

ముత్యాల జలపాతం అడవుల్లో చిక్కుకున్న 84 మంది టూరిస్ట్‌లు!

Ram Narayana

Leave a Comment