Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

శ్రీశైలం క్షేత్రంలో చంద్రలింగాన్ని చుట్టుకున్న నాగుపాము..

  • మల్లికార్జున స్వామిని చేరుకున్న వాసుకి
  • అరుదైన దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తులు
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. మల్లికార్జున స్వామి చెంతకు వాసుకి చేరుకుంది. స్వామి ప్రతిరూపమైన లింగాన్ని చుట్టుకుని కనిపించడంతో భక్తులు మైమరిచిపోయారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. నంద్యాల జిల్లా నల్లమల అడవుల్లోని ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ క్షేత్రంలోని పాతాళ గంగ వద్ద చంద్రలింగం ఉంది. భక్తులు నిత్యం దర్శించుకునే ఈ లింగం వద్ద మంగళవారం అద్భుతం జరిగింది. చంద్రలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తులకు లింగాన్ని చుట్టుకున్న నాగుపాము కనిపించింది.

ఇది చూసి మల్లికార్జున స్వామి వద్దకు వాసుకి వచ్చి చేరిందని విశ్వసిస్తూ భక్తులు తన్మయత్వం చెందారు. ఈ విషయం తెలిసి భక్తులు ఆలయానికి పోటెత్తారు. కాగా, అటవీ ప్రాంతం కావడంతో ఆలయం చుట్టుపక్కల పాములు తిరుగాడటం సాధారణమే కానీ ఇలా లింగాన్ని ఓ పాము చుట్టుకుని కనిపించడం అసాధారణమని ఆలయ సిబ్బంది తెలిపారు. గతంలో ఇలాంటి సంఘటన జరిగినట్లు వినలేదని పేర్కొన్నారు. ఈ అసాధారణ దృశ్యాన్ని కొంతమంది భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related posts

ఎన్నికల బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వీరి గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు!

Ram Narayana

విచిత్ర దొంగతనం …దోచుకెళ్లిన సొత్తు మల్లి ఇస్తానని ప్రామిస్ లేఖ

Ram Narayana

భారతీయ పురుషులకు రొమాన్స్ అంటే ఏంటో తెలియదు.. సంచలనంగా మారిన లైఫ్ కోచ్ స్టేట్‌మెంట్!

Ram Narayana

Leave a Comment