Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

కేరళ సీఎం విజయన్ ను కలిసి రూ.1 కోటి చెక్ అందించిన చిరంజీవి… !

  • వాయనాడ్ జిల్లాలో విరిగిపడిన కొండచరియలు
  • 400 మందికి పైగా మృత్యువాత
  • రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
  • ప్రత్యేక విమానంలో నేడు కేరళ వెళ్లిన చిరంజీవి

కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాతపడడం తెలిసిందే. వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది గల్లంతు కావడం అందరినీ కదలించింది. 

ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విపత్తులో జరిగిన ప్రాణనష్టం పట్ల చలించిపోయారు. ఇరువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో చిరంజీవి నేడు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన చిరంజీవి రూ.1 కోటి చెక్ ను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

న్యూస్ క్లిక్ వెబ్ పోర్టల్ పై అసలేం జరిగింది….

Ram Narayana

అమితాబ్ బచ్చన్‌కు కాంగ్రెస్ ప్రత్యేక విజ్ఞప్తి

Ram Narayana

బీజేపీ వాళ్లకు ఏ జడ్జీ శిక్ష వేయరు: ప్రియాంక గాంధీ!

Drukpadam

Leave a Comment