జాతీయ వార్తలు

కేరళ సీఎం విజయన్ ను కలిసి రూ.1 కోటి చెక్ అందించిన చిరంజీవి… !

  • వాయనాడ్ జిల్లాలో విరిగిపడిన కొండచరియలు
  • 400 మందికి పైగా మృత్యువాత
  • రూ.1 కోటి విరాళం ప్రకటించిన చిరంజీవి, రామ్ చరణ్
  • ప్రత్యేక విమానంలో నేడు కేరళ వెళ్లిన చిరంజీవి

కేరళలోని వాయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపం కారణంగా 400 మందికి పైగా మృత్యువాతపడడం తెలిసిందే. వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో వందలాది మంది గల్లంతు కావడం అందరినీ కదలించింది. 

ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విపత్తులో జరిగిన ప్రాణనష్టం పట్ల చలించిపోయారు. ఇరువురు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో చిరంజీవి నేడు ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిసిన చిరంజీవి రూ.1 కోటి చెక్ ను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం విజయన్ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

ఫాస్టాగ్ వన్ ఇయర్ పాస్… వివరాలు!

Ram Narayana

మన్మోహన్ కు కడసారి వీడ్కోలు పలికిన సోనియా!

Ram Narayana

కీలక ప్రకటన చేసిన సుప్రీంకోర్టు తాజా మాజీ సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా!

Ram Narayana