Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిశోర్..నాయకత్వం తన చేతుల్లో లేదని వెల్లడి!

  • జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన ప్రశాంత్ కిశోర్
  • పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు వెల్లడి
  • కొత్త పార్టీ నాయకత్వం తన చేతుల్లో లేదన్న ప్రశాంత్ కిశోర్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ‘జన్ సురాజ్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందినట్లు చెప్పారు. బీహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు.

కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే ఈ పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో లేదన్నారు. రెండేళ్లుగా ఈ పార్టీ కోసం శ్రమించిన వారే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా బీహార్ ప్రజలు ఆర్డేజీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని, ఇక ఈ సంప్రదాయం అంతం కావాలన్నారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది ఏమీ కాదన్నారు. జన్ సూరజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని తెలిపారు.

Related posts

వారణాసిలో మోడీతో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్…!

Ram Narayana

లక్ష జీతం సరిపోక చోరీల బాట పట్టిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. స్నేహితుడి ఇంట్లో దోపిడీ చేసి జైలుకు!

Ram Narayana

అవినీతిపరులను వదిలేది లేదు… వారికి జైలు లేదా బెయిల్ రెండే ఆప్షన్స్: ప్రధాని మోదీ

Ram Narayana

Leave a Comment