అంతర్జాతీయం

ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీకి మళ్లింపు!

  • ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో విమానం టేకాఫ్
  • ఆ వెంటనే బాంబు బెదిరింపు
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానానికి తనిఖీలు

ముంబై నుంచి ఈ తెల్లవారుజామున న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించాడు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం విమానంలో తనిఖీలు జరుగుతున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.

తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. ఆ వెంటనే విమానంలో బాంబు ఉందంటూ హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే దానిని ఢిల్లీకి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. 

విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related posts

భారత్‌పై ట్రంప్ టారిఫ్‌ల వెనుక అసలు వ్యూహం ఇదే!

Ram Narayana

కెనడా ఎన్నికల్లో ఖలిస్థాన్ మద్దతుదారుడు జగ్‌మీత్ సింగ్ ఓటమి… పార్టీ నాయకత్వానికి రాజీనామా!

Ram Narayana

బ్రిటన్‌లో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స తీసుకున్న తొలి పేషెంట్‌గా భారత సంతతి టీనేజర్

Ram Narayana