Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీకి మళ్లింపు!

  • ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో విమానం టేకాఫ్
  • ఆ వెంటనే బాంబు బెదిరింపు
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానానికి తనిఖీలు

ముంబై నుంచి ఈ తెల్లవారుజామున న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించాడు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం విమానంలో తనిఖీలు జరుగుతున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.

తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. ఆ వెంటనే విమానంలో బాంబు ఉందంటూ హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే దానిని ఢిల్లీకి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. 

విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related posts

కెనడాలో విదేశీ ఉద్యోగులపై ఉక్కుపాదం.. భారతీయుల నిరాహార దీక్ష…

Ram Narayana

తైవాన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న చైనా.. 41 యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు

Ram Narayana

ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయుడు.. ప‌ట్టించిన వారికి రూ. 2 కోట్ల రివార్డు!

Ram Narayana

Leave a Comment