అంతర్జాతీయం

ముంబై-న్యూయార్క్ విమానానికి బాంబు బెదిరింపు.. ఢిల్లీకి మళ్లింపు!

  • ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో విమానం టేకాఫ్
  • ఆ వెంటనే బాంబు బెదిరింపు
  • ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానానికి తనిఖీలు

ముంబై నుంచి ఈ తెల్లవారుజామున న్యూయార్క్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి మళ్లించాడు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, ప్రస్తుతం విమానంలో తనిఖీలు జరుగుతున్నట్టు అధికారి ఒకరు తెలిపారు.

తెల్లవారుజామున 2 గంటల సమయంలో ముంబైలోని చత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరింది. ఆ వెంటనే విమానంలో బాంబు ఉందంటూ హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే దానిని ఢిల్లీకి మళ్లించి సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. 

విమానం ప్రస్తుతం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. సెక్యూరిటీ సిబ్బంది విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related posts

క్షిపణి దాడి నుంచి మొజ్తబా ఖమేనీ ఎలా బయటపడ్డారు?

Ram Narayana

విమాన ప్రయాణం అస్తవ్యస్తం.. చుక్కలు చూపిస్తున్న టికెట్ ధరలు!

Ram Narayana

ట్రంప్-పుతిన్ భేటీపై భారత్ హర్షం…

Ram Narayana