ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

టీడీపీలో చేరిన ఎనిమిది మంది వైసీపీ సర్పంచ్ లు…


ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వైసీపీ ఖాళీ కాగా తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు సర్పంచ్ లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కు గుడ్ బై చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలంలో ఎనిమిది గ్రామాల సర్పంచులు తాజాగా పార్టీ మారారు. మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గ్రామ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్నారు.

Related posts

బీజేపీ గూటికి చేరిన విశాఖ డెయిరీ చైర్మన్..!

Ram Narayana

కొత్త పార్టీ పెడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ…

Ram Narayana

రోజాపై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు… తీవ్రస్థాయిలో స్పందించిన జగన్!

Ram Narayana