క్రైమ్ వార్తలు

కారును దగ్ధం చేసిన మావోయిస్టులు! ఏజన్సీ ఏరియాలో కలకలం

maoists set fire to vehicle in alluri sitarama raju district tension in chinturu agency
  • చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్లే జాతీయ రహదారిలో కారును దగ్ధం చేసిన మవోయిస్టులు
  • మావోయిస్టుల వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఘటన
  • ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్న పోలీసులు

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజన్సీ ఏరియాలో జాతీయ రహదారిపై సరివెల వద్ద మావోయిస్టులు ఓ కారును దగ్ధం చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. చింతూరు వైపు నుండి భద్రాచలం వెళ్లే రహదారి మధ్యలో సుమారు రాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

ఈ నెల 2 నుంచి 8 వరకూ మావోయిస్టుల వారోత్సవాలు జరిగాయి. వారోత్సవాలు ముగిసిన మరుసటి రోజు ఈ ఘటన జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే దగ్ధమైన కారు ఎటు నుంచి బయలుదేరింది? ఎంత మంది వ్యక్తులు అందులో ప్రయాణించారు? అనే సమాచారం తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఏజన్సీ ఏరియాలో ఆందోళన రేకెత్తిస్తోంది.  

Related posts

స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్ పై వేటు!

Drukpadam

వివేకానందరెడ్డి హత్యను నాపై వేసుకుంటే రూ. 10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు:గంగాధర్‌రెడ్డి

Drukpadam

విజయసాయిరెడ్డి అల్లుడి అన్నను అరెస్ట్ చేసిన ఈడీ !

Drukpadam