ఆంధ్రప్రదేశ్

పెన్షన్ల పంపిణీలో వసూళ్లకు పాల్పడిన మహిళా పోలీసుపై వేటు!

  • ఏపీలో నేడు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
  • వైఎస్సార్ జిల్లాలో ఓ మహిళా పోలీసు వసూళ్ల దందా
  • కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేసిన మున్సిపల్ కమిషనర్

ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విస్తృతస్థాయిలో జరుగుతోంది. కాగా, వైఎస్సార్ జిల్లాలో పెన్షన్ల పంపిణీలో వసూళ్లకు పాల్పడిన ఓ మహిళా పోలీసుపై సస్పెన్షన్ వేటు పడింది. 

జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ సందర్భంగా మహిళా పోలీసు భారతి వసూళ్లకు పాల్పడినట్టు వెల్లడైంది. భారతి జమ్మలమడుగులో వార్డు సచివాలయ మహిళా పోలీసుగా పనిచేస్తోంది. ఈ ఉదయం పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆమె పలువురి నుంచి డబ్బులు తీసుకోవడం అధికారుల దృష్టికి వెళ్లింది. వసూళ్ల నేపథ్యంలో, కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ కమిషనర్ ఆమెను సస్పెండ్ చేశారు.

Related posts

అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సప్ స్పామ్ కాల్స్ పై రంగంలోకి కేంద్రం!

Drukpadam

కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

Ram Narayana

బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఖమ్మం కుర్రాడు వి జే సన్నీ !

Drukpadam