జాతీయ వార్తలు

ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్… 11 మంది నక్సల్స్ మృతి

  • మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ
  • బీజాపూర్ జిల్లాలో కాల్పుల మోత
  • నేటి ఉదయం 9 గంటల నుంచి ఎదురుకాల్పులు

ఇటీవల కాలంలో ఛత్తీస్ గఢ్ లో వరుస ఎన్ కౌంటర్లతో నక్సల్స్ కు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల ఘటనలో 11 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దు అటవీప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. 

బీజాపూర్ జిల్లా బారేడుబాక అటవీ ప్రాంతం వద్ద భద్రతా దళాలకు, నక్సల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపడుతున్న సంయుక్త భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ ఉదయం 9 గంటల నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఘటన స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Related posts

బళ్లారిలో టెన్షన్.. గాలి జనార్దన్ రెడ్డి భవనానికి నిప్పు…

Ram Narayana

జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ నివేదిక రాష్ట్రపతికి, ప్రధానికి సమర్పణ

Ram Narayana

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు…!

Drukpadam