నా రాజీనామా విషయం జగన్ తో చెప్పాను …
అన్న రాజీనామా చేయవద్దు నీ వెనక మేము ఉన్నామని చెప్పారు
జగన్ ప్రజాదరణ ఉన్న నాయకుడు
వైయస్ కుటుంబంతో 4 దశాబ్దాల అనుబంధం
అది అప్పుడు ,ఇప్పుడు , భవిష్యత్ లో కొనసాగుతుంది
వేయిమంది విజయసాయిలు పార్టీలు వీడిన పార్టీకి ఇబ్బంది లేదు …
అబద్దం చెప్పను …చెప్పాల్సిన అవసరంలేదు …వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నవాణ్ణి నా రాజీనామాకు ఎవరు వత్తిడి లేదు …కూటమి ప్రభుత్వానికే ఉపయోగం జరుగుతుందని తెలుసు అయినా ఎంపీగా తన భాద్యతలను సరిగా నెరవేర్చలేనని భావించాను …ఏ రాజకీయ పార్టీలో చేరను… నా రాజీనామా విషయం జగన్ తో చెప్పాను…ఆయన అన్న రాజీనామా చేయవద్దని ఏదైనా సమస్య ఉంటె నీ వెనక మేము ఉన్నామని చెప్పారు …ఆయన నా నిర్ణయాన్ని మార్చుకోదల్చుకోలేదు …జగన్ కు మంచి జరగలేని కోరు కుంటున్నాను …జగన్ ప్రజాదరణ ఉన్న నాయకుడు ..2019 ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన నాయకుడు …మొన్నటి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చాయి..అందువల్ల ఆపార్టీకి వేయిమంది విజయసాయిలు వెళ్లి పోయిన ఏమీకాదు అని గద్గద స్వరంతో అన్నారు …వైయస్ కుటుంబంతో 4 దశాబ్దాల అనుబంధం ఉంది …మూడు తారలు రాజిరెడ్డి ,,రాజశేఖర్ రెడ్డి ,జగన్ మోహన్ రెడ్డితో పనిచేశాను ..అది అప్పుడు …ఇప్పుడు …భవిష్యత్ లు ఉంటుంది అని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు … నాపై అనేక నిందలు మోపారు …మహిళతో సంబంధం ఉందని కొందరు పని కట్టుకొని రాశారు …వారిపై డిఫమేషన్ కేసు వేశాను దానిపై నా పోరాటం కొనసాగుతుంది … టీవీ ఛానల్ పెడతానని గతంలో ప్రకటించాను …అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా దానిపై ఆలోచన చేయాల్సి ఉందని అన్నారు …తాను బీజేపీ నుంచి రాజ్యసభకు , గవర్నర్ పదవినే ఆశించి తాను రాజీనామా చేయలేదని తెలిపారు … ఏ పార్టీలో చేరబోనని అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు … కేసులకు భయపడి రాజీనామా చేశాననే జరుగుతున్న ప్రచారం అబద్ధమన్నారు …తాను కేసులకు భయపడే వాడిని కానే కాదని అన్నారు … వ్యవసాయం చేసుకోవాలనే ఆలోచన చేస్తున్నానని పేర్కొన్నారు …