ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

నరసరావుపేటలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11 లక్షలు వసూలు…

  • ఆన్ లైన్ లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయంటూ ఫోన్ కాల్
  • అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారని బెదిరింపులు
  • భయపడి వారు కోరిన డబ్బు చెల్లించిన యువతి
  • కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు

ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓసాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించిన కేటుగాళ్లు రూ.11 లక్షలు వసూలు చేశారు. ఆన్‌లైన్ లో గంజాయి కొన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని మోసగాళ్లు ఆ ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారంటూ ఆ యువతికి ఫోన్ కాల్స్ చేశారు. 

దాంతో భయపడిపోయిన ఆ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో వారడిగిన డబ్బు చెల్లించింది. అనంతరం, ఈ వ్యవహారంపై ఆమె నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

అక్టోబర్ 16న కేసీఆర్ చెప్పే ఆ శుభవార్త కోసం సిద్ధంగా ఉండండి: హరీశ్ రావు

Ram Narayana

ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం: పిడుగుపాటుకు ఆరుగురు రైతులు బలి!

Ram Narayana

మాజీ సీఎం జ‌గ‌న్‌కు షాక్‌.. ఆ భూములు వెన‌క్కి తీసుకుంటూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు!

Ram Narayana