Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

నరసరావుపేటలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11 లక్షలు వసూలు…

  • ఆన్ లైన్ లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయంటూ ఫోన్ కాల్
  • అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారని బెదిరింపులు
  • భయపడి వారు కోరిన డబ్బు చెల్లించిన యువతి
  • కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు

ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓసాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించిన కేటుగాళ్లు రూ.11 లక్షలు వసూలు చేశారు. ఆన్‌లైన్ లో గంజాయి కొన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని మోసగాళ్లు ఆ ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారంటూ ఆ యువతికి ఫోన్ కాల్స్ చేశారు. 

దాంతో భయపడిపోయిన ఆ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో వారడిగిన డబ్బు చెల్లించింది. అనంతరం, ఈ వ్యవహారంపై ఆమె నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

మహారాష్ట్రలో ముస్లిం మత పెద్దను కాల్చి చంపిన దుండగులు!

Drukpadam

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన సీఎం చంద్ర‌బాబు, మంత్రి లోకేశ్‌!

Ram Narayana

ఆటో మొబైల్ రంగంలో పెనుమార్పులు -కేంద్రం కొత్త చట్టం

Drukpadam

Leave a Comment