Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్క్రైమ్ వార్తలు

నరసరావుపేటలో సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని బెదిరించి రూ.11 లక్షలు వసూలు…

  • ఆన్ లైన్ లో గంజాయి కొన్నట్టు ఆధారాలు ఉన్నాయంటూ ఫోన్ కాల్
  • అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారని బెదిరింపులు
  • భయపడి వారు కోరిన డబ్బు చెల్లించిన యువతి
  • కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట పోలీసులు

ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓసాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని బెదిరించిన కేటుగాళ్లు రూ.11 లక్షలు వసూలు చేశారు. ఆన్‌లైన్ లో గంజాయి కొన్నట్టుగా ఆధారాలు ఉన్నాయని మోసగాళ్లు ఆ ఐటీ ఉద్యోగినికి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసేందుకు స్పెషల్ పోలీసులు వస్తున్నారంటూ ఆ యువతికి ఫోన్ కాల్స్ చేశారు. 

దాంతో భయపడిపోయిన ఆ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో వారడిగిన డబ్బు చెల్లించింది. అనంతరం, ఈ వ్యవహారంపై ఆమె నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

విద్యత్ శాఖ ఏసీడీ పేరుతో దొంగ చాటు వసూల్ …ఖమ్మంలో సిపిఎం ధర్నా

Drukpadam

ప్రభుత్వ అధికారులకు విద్యుత్ వాహనాలను అందిస్తాం: గడ్కరీ

Drukpadam

ఉద్యమం కొనసాగించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ నిర్ణయం!

Drukpadam

Leave a Comment