తెలంగాణ వార్తలు

ఆ రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు: తుమ్మల నాగేశ్వరరావు!

  • ఎకరం వరకు సాగు చేస్తున్న వారికి నిధులు జమ చేస్తామన్న మంత్రి
  • మొత్తం 17.03 లక్షల రైతుల అకౌంట్లలోకి నిధులు జమ 
  • ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నిధులు పంపిణీ చేస్తున్నామన్న మంత్రి

రైతు భరోసా నిధులు ఈ రోజు నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొదటి విడతగా ఎకరం వరకు సాగు భూమి ఉన్న దాదాపు 17.03 లక్షల రైతుల ఖాతాల్లో బుధవారం నిధులు జమ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిధుల పంపిణీ జరుగుతున్నదని ఆయన తెలిపారు.

ప్రభుత్వం నాలుగు పథకాల అమలులో భాగంగా గణతంత్ర దినోత్సవం నాడు రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఆ రోజు సెలవు దినం కావడంతో, మరుసటి రోజు ఒక్కో మండలానికి ఒక గ్రామంలో రైతు భరోసా నిధులను చెల్లించారు. 32 జిల్లాల్లోని 563 గ్రామాల్లో రూ. 4,41,911 మంది రైతులకు ఒక్కో ఎకరానికి మొదటి విడతగా రూ.6 వేల పెట్టుబడి సాయం అందించింది.

Related posts

సంపద పెంచాం.. ప్రజలకు పంచాం: సీఎం కేసీఆర్….

Ram Narayana

గీత దాటితే వేటు తప్పదు…తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ వార్నింగ్ ..!

Drukpadam

స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం సీట్లు గెలుచుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్

Ram Narayana