- ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం
- ప్రజల్లో ఆందోళన
- గుంటూరులో బర్డ్ ఫ్లూ అవగాహన కార్యక్రమం
- పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చికెన్ ఫుడ్ మేళా
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తోంది. ఏపీ, తెలంగాణలో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. కోడి మాంసం తినేందుకు జనాలు వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గుంటూరులోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్ లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చికెన్ ఫుడ్ మేళాలో ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేందుకే ఈ ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ హాజరయ్యారు.
ఇక, ఉచితంగా చికెన్ వంటకాల పంపిణీ అనేసరికి జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్ మేళా ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసేయాల్సి వచ్చింది.