Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంప్రమాదాలు ...

రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది దుర్మరణం…

  • బొలీవియాలోని పొటోసీలో ఘటన 
  • మరో 39 మందికి గాయాలు
  • అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు

బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Related posts

పరస్పర క్షిపణి దాడుల తర్వాత కీలక పరిణామం.. పాకిస్తాన్-ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య

Ram Narayana

వేలానికి ప్రపంచంలో ఖరీదైన స్కాచ్ విస్కీ

Ram Narayana

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల… ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

Ram Narayana

Leave a Comment