అంతర్జాతీయంప్రమాదాలు ...

రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది దుర్మరణం…

  • బొలీవియాలోని పొటోసీలో ఘటన 
  • మరో 39 మందికి గాయాలు
  • అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు

బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఉయుని, కొల్చాని రహదారిపై ప్రయాణిస్తున్న రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు వెల్లడించారు. ప్రమాద తీవ్రతకు ఒక బస్సు లోయలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

Related posts

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్!

Ram Narayana

ట్రంప్‌కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. సుంకాలు చట్టవిరుద్ధమని సంచలన తీర్పు!

Ram Narayana

కేరళలో నిలిచిపోయిన బ్రిటన్ అత్యాధునిక యుద్ధ విమానం … కొనసాగుతున్న సందిగ్ధత

Ram Narayana