Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పై బీజేపీ దాడి …అవి చీకటి రోజులన్న ప్రధాని మోదీ…

ఇందిరాగాంధీ ఎమర్జన్సీ పై బీజేపీ దాడి …అవి చీకటి రోజులన్న ప్రధాని మోదీ
-ఆఖరికి మహాత్ముడి స్ఫూర్తి మాటలకూ అడ్డు చెప్పారు
-ఇందిర ఎమర్జెన్సీ సమయంలో ఏవేవి నిషేధించారో వివరిస్తూ బీజేపీ ఎటాక్​
-సోషల్ మీడియాలో ప్రచారం
-భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ సినిమాలు బ్యాన్
-కిషోర్ కుమార్ పాటలపై నిషేధం
-వ్యవస్థలను నాశనం చేసి నీతులు వల్లిస్తున్నారని విమర్శ

బీజేపీ మరోసారి సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పై దాడి ప్రారంభించింది. నాలుగున్నర శతాబ్దాలక్రితం ఇందిరాగాంధీ విధించిన ఎమర్జన్సీ పై విమర్శలు గుప్పించింది. ప్రజాస్వామ్య విలువలను ఇందిరాగాంధీ నాశనం చేశారని ఇదేమని ప్రశ్నించిన వారిని జైళ్లలో పెట్టారని గుర్తు చేసింది.నాటి సంఘటనలు దేశ ప్రజలు మరిచి పోలేదని కాంగ్రెస్ విధానాలను తూర్పార పట్టింది.
ఇందిరా గాంధీ హయాంలో విధించిన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)పై బీజేపీ మండి పడింది . 1975 నుంచి 1977 మధ్య 21 నెలల పాటు చీకటి రోజులని , ఇందిరా ఎమర్జెన్సీ రాజ్యం ఎలాంటి ఆంక్షలు విధించిందో ‘‘ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ: భారత ప్రజాస్వామ్యంలో నమ్మలేని దశ’’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తోంది. అలాంటి చీకటి రోజులు ఎప్పుడూ రాలేదని వ్యాఖ్యానించింది. ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎమర్జెన్సీపై కామెంట్ చేశారు. బీజేపీ మొదలు పెట్టిన ప్రచార చిత్రాలను పోస్ట్ చేశారు.

ఆ చీకటి రోజులను ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. అన్ని సంస్థలు, వ్యవస్థలను ఓ పద్ధతి ప్రకారం నాశనం చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలను కాంగ్రెస్ ఎలా భ్రష్టు పట్టించిందో ఎమర్జెన్సీనే ఒక ఉదాహరణ అన్నారు. ఆ ఎమర్జెన్సీపై పోరాటం చేసినవారిని ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటామని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని మోదీ అన్నారు.

దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత పటిష్ఠం చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. రాజ్యాంగం నేర్పించిన విలువలను అందరూ పాటించాలన్నారు.

కాగా, ఎమర్జెన్సీ సమయంలో వేటిపై నిషేధం విధించారో ఇన్ స్టా గ్రామ్ వేదికగా బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘‘చంద్రశేఖర్ ఆజాద్ , భగత్ సింగ్ కు సంబంధించిన సినిమాలను నిషేధించారు. ఆఖరుకు కిషోర్ కుమార్ పాటలనూ విననివ్వలేదు. మహాత్మాగాంధీ, రవీంద్ర నాథ్ ఠాగూర్ స్ఫూర్తి వాక్యాలనూ వాడనివ్వలేదు. ఎమర్జెన్సీ సమయంలో వీటన్నింటినీ నిషేధించారంటే నమ్మగలరా?’’ అని పేర్కొంది. ‘కాబట్టి మన దేశానికి ఇంత నష్టం చేసిన వారిని మళ్లీ అధికారంలోకి రానివ్వకుండా చేస్తామని ప్రతిజ్ఞ చేయండి’ అంటూ పిలుపునిచ్చింది. వాటికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసింది.

Related posts

కర్ణాటకలో ఉచిత వ్యాక్సిన్లకు 100 కోట్లతో ముందుకు వచ్చిన కాంగ్రెస్ …

Drukpadam

కోర్ట్ మొట్టికాయలు వేసినా మారని పవన్ కళ్యాణ్ …

Drukpadam

తెలంగాణ ,ఆంధ్రా మధ్య పోలవరం చిచ్చు …

Drukpadam

Leave a Comment