- కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి
- ఉత్తరాది రాష్ట్రాలకు భారీగా నిధులు తిరిగిస్తోందని ఆరోపణ
- దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని ఫైర్
కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పెద్ద మొత్తంలో పన్నులు చెల్లిస్తోందని, తిరిగి పొందుతున్నది మాత్రం స్వల్పమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇస్తే, కేంద్రం కేవలం 42 పైసలు మాత్రమే తిరిగిస్తోందని విమర్శించారు. అదే బీహార్ కు మాత్రం రూపాయికి ఏకంగా 6 రూపాయలు తిరిగిస్తోందని చెప్పారు. ఈమేరకు శనివారం చెన్నైలో స్టాలిన్ సర్కారు ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పన్నుల చెల్లింపు విషయంలో తెలంగాణతో పాటు తమిళనాడు (రూపాయికి 26 పైసలు), కర్ణాటకకు (రూపాయికి 16 పైసలు) మాత్రమే అందుతున్నాయని తెలిపారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ కు (రూపాయికి రూ. 2.03), మధ్యప్రదేశ్ కు (రూపాయికి రూ.1.73) అందుతున్నాయని తెలిపారు.
‘తెలంగాణలో వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సాధించాం. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలోనూ వృద్ధి సాధించాం. తెలంగాణలో సుపరిపాలనతోపాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అభివృద్ధిలో రాణిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు రాజకీయ పరిమితులు చేటు చేస్తాయి’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కు తెలంగాణ వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ విధానంలో పారదర్శకత లోపించిందని, దీనివల్ల రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానత్వం ఏర్పడుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. డీలిమిటేషన్ పేరుతో లోక్ సభ సీట్లు పెంచవద్దని, సీట్ల పెంపుతో సంబంధంలేకుండా అంతర్గత డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 1976 లో కూడా లోక్ సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ జరిపారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి

- జనాభా ఆధారిత పునర్విభజనను వ్యతిరేకిస్తున్నామన్న రేవంత్ రెడ్డి
- పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం
- ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించబోమన్న ముఖ్యమంత్రి
పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రతిపాదించిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలకు రాజకీయపరమైన పరిమితులు విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానతకు దారితీస్తుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. లోక్సభ సీట్లను పెంచకుండా రాష్ట్రాల్లో అంతర్గత నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. గతంలో 1976లో సీట్లను పెంచకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టారని గుర్తు చేశారు.
జనాభా ఆధారిత పునర్విభజన ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యం తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదిని ఉత్తరాది రాష్ట్రాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను ఆమోదించవద్దని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు.
తెలంగాణ వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించిందని, జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో వృద్ధిని నమోదు చేసిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో సుపరిపాలనతో పాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి భారీగా చెల్లింపులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రూపాయి చెల్లిస్తే తెలంగాణకు 42 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కర్ణాటకకు 16 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని ఆయన తెలిపారు. అదే బీహార్కు రూ.6.06, ఉత్తరప్రదేశ్కు రూ.2.03, మధ్యప్రదేశ్కు రూ.1.73 మేర తిరిగి వస్తున్నాయని ఆయన వివరించారు.