Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది: రాష్ట్ర డీజీపీ యం. మహేందర్ రెడ్డి…

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది: రాష్ట్ర డీజీపీ యం. మహేందర్ రెడ్డి

ప్రజా నమ్మకమే అధునిక పోలీస్ వ్యవస్థకు పునాది అని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అడ్డగూడురు పోలీస్ స్టేషన్ ఘటనలో ఖమ్మం నగరంలోని సంకల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయ్ కిరణ్
పరామర్శించేందుకు రాష్ట్ర డీజీపీ, నార్త్ జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి తో కలసి ఆదివారం హెలికాప్టర్ లో జిల్లాకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆర్వి. కర్ణన్,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ కలసి
సంకల్ప ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ఆనంతరం జిల్లాలోని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ,త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ,కొణిజర్ల పోలీస్ స్టేషన్ ,పోలీస్ హెడ్ క్వార్టర్స్ MT సెక్షన్ ను అకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ ….ఏ పోలీస్ స్టేషన్ కెళ్లిన ఒకేవిధమైన స్పందన, ఏకీకృత సేవలు అందుస్తూ పారదర్శకతను విస్తరింపజేయడం పోలీసుల లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా నిష్పక్షపాతంగా
సేవలందించాలని అన్నారు

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజామోదం లభించటం ద్వారానే విధినిర్వహణ సామర్థ్యం ఆధారపడి ఉంటుందని తెలిపారు.
పోలీసు శాఖపై ప్రజలకు విశ్వాసం పెరిగిననాడే నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చునని అన్నారు.

రక్షణ కోసం వచ్చిన బాధ్యతల పట్ల మానవీయ కోణంలో వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అన్నారు.

14 ఫంక్షనల్ వర్టికల్స్, 5 s విధానాన్ని , లీడర్ షిప్ క్వాలిటీ అమలు తీరును అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ప్రతిఒక్కరికి పని విభజన చేసి ఖచ్చితమైన బాధ్యతలు అప్పగించటం జరిగిందని తద్వారా తమకు అప్పగించిన పని తానే చేయాలనే తపనతో జవాబుదారీ తనం వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ లో రిసెప్షన్ స్టాప్, స్టేషన్ రైటర్స్, క్రైమ్ రైటర్స్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ కార్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ , టెక్నికల్ టీమ్, క్రైమ్ స్టాప్ తదితర విభాగాలలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని వారి యొక్క విధివిధానాలను ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు.

5 s -1) Sort , 2) Straighten, 3) Shine, 4) Standardize,
5)Sustain ప్రకారం పోలీస్ అధికారులు తమ పోలీస్ స్టేషన్ల పరిసరాలను,
రికార్డులు, వస్తువులను జాగ్రతగా వాటిని ఒక ప్రాంతాని కేటాయించి సక్రమ పద్దతిలో
శుభ్రంగా ఉంచాలని తద్వారా పోలీస్ స్టేషన్లకు బదిలీపై వచ్చే
ఏ పోలీస్ అధికారికైన రికార్డుల పరిశీలన సులభతరం ఆవుతుందని అన్నారు.

మరియమ్మ లాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి
ఖమ్మం మీడియా సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి ……

అడ్డగూడూరు పోలిస్ స్టేషన్ లో జరిగిన మరియమ్మ కస్టోడియల్ మరణం చాలా బాధాకరమని రాష్ట్ర డీజీపీ యం. మహేందర్ రెడ్డి గారు అన్నారు. నార్త్ జోన్ ఐజీపీ వై. నాగిరెడ్డి ,పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తో కలసీ డీజీపీ గారు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మరియమ్మ మరణానికి గల కారణాలపై విచారణ కొనసాగుతుందని, బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఏదేమైనాప్పటికీ ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాల్సిన బాధ్యత పోలీసుశాఖలోని పోలీసు అధికారులపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం తో ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పనిచేస్తూ…..భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

ఈరోజు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించి ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అడి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించిందని ఈ సందర్భంగా తెలిపారు.

నేరాల నియంత్రణ,నేరస్ధులను పట్టుకున్న సమయంలో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కేసుల విచారణ సమయంలో ప్రాణాలకు, ఆత్మగౌరవం దెబ్బతినకుండా చట్టప్రకారం వ్యవహరించాల్సిన బాధ్యత పోలీసు అధికారులు,సిబ్బందిపై ఉందన్నారు.

 

Related posts

తమిళ బ్రాహ్మణ యువకులకు పెళ్లి కష్టాలు…వధువుల కోసం వేట!

Drukpadam

తొమ్మిదేళ్లుగా తమ కుమార్తెకు పేరుపెట్టని దంపతులు… వారి కల నెరవేర్చిన సీఎం కేసీఆర్

Drukpadam

మాతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో లేదు: ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ!

Drukpadam

Leave a Comment