సినిమా వార్తలు

రేపు సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ

  • ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో ఉద‌యం 10 గంట‌ల‌కు సీఎంతో స‌మావేశం
  • సీఎంతో భేటీపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం
  • తాజా ప‌రిణామాలు, చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై భేటీలో చ‌ర్చ‌

గురువారం ఉద‌యం 10 గంట‌ల‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో స‌మావేశం కానున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు అంద‌రం క‌లిసి రేపు ముఖ్య‌మంత్రిని క‌లుస్తామ‌ని దిల్ రాజు వెల్ల‌డించారు. సీఎంతో భేటీపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం ఇస్తున్నారు. 

కాగా, ఈ స‌మావేశంలో తాజా ప‌రిణామాలు, చిత్ర ప‌రిశ్ర‌మ అభివృద్ధిపై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ రోజు అల్లు అర‌వింద్‌, మైత్రి మూవీ మేక‌ర్స్‌తో పాటు వెళ్లి కిమ్స్ ఆసుప‌త్రిలో శ్రీతేజ్‌ను దిల్ రాజు ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఇక అల్లు అర్జున్, సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ క‌లిసి రేవ‌తి కుటుంబానికి రూ.2కోట్ల సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 

Related posts

‘కన్నప్ప’ చిత్రంపై బ్రాహ్మణ సంఘాల ఫైర్

Ram Narayana

టాలీవుడ్ పరిణామాలపై 27 మందితో కమిటీ: నిర్మాత సి.కల్యాణ్

Ram Narayana

 ఏపీ పరిణామాలపై చిత్ర పరిశ్రమ ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఏం చెప్పారంటే…!

Ram Narayana