Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

పూరీ ఆలయంలో వింత ఘటన.. భక్తుల విస్మయం!

  • జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వీడియో ఇదిగో!
  • సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తులు
  • ఆలయ దర్శనంలో తొలుత జెండాకు భక్తుల మొక్కులు

పూరీ జగన్నాథ ఆలయంలో ఆదివారం ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ శిఖరంపై ఎగురవేసే జగన్నాథుడి పవిత్ర జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లింది. జెండాను తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యంతోపాటు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

జగన్నాథుడి దర్శనం కోసం పూరీ వచ్చే భక్తులు తొలుత ఈ పతితపావన జెండాకు నమస్కరించుకుంటారు. ఆపై ఆలయంలోకి వెళ్లి జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.

Related posts

సినీ ఫక్కీలో పెళ్లి పీటల మీదనుంచి వధువు జంప్ …

Ram Narayana

అతి అంటే ఇదేనేమో …20 వేల డౌన్ పేమెంట్ తో మోపెడ్ కొనుగోలు …60 వేలు పెట్టి డీజే తో ఊరేగింపు!

Ram Narayana

73ఏళ్ల భార్యకు 70ఏళ్ల భర్త విడాకులు.. వ్య‌వ‌సాయ భూమి అమ్మి రూ.3.7 కోట్ల భరణం ఇచ్చిన రైతు!

Ram Narayana

Leave a Comment