ఆఫ్ బీట్ వార్తలు

పూరీ ఆలయంలో వింత ఘటన.. భక్తుల విస్మయం!

  • జగన్నాథుడి జెండా ఎత్తుకెళ్లిన గద్ద.. వీడియో ఇదిగో!
  • సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టిన భక్తులు
  • ఆలయ దర్శనంలో తొలుత జెండాకు భక్తుల మొక్కులు

పూరీ జగన్నాథ ఆలయంలో ఆదివారం ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. ఆలయ శిఖరంపై ఎగురవేసే జగన్నాథుడి పవిత్ర జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లింది. జెండాను తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యంతోపాటు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు ఈ ఘటనను తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

జగన్నాథుడి దర్శనం కోసం పూరీ వచ్చే భక్తులు తొలుత ఈ పతితపావన జెండాకు నమస్కరించుకుంటారు. ఆపై ఆలయంలోకి వెళ్లి జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు.

Related posts

ఊడ్చే ఉద్యోగానికి 40 వేల మంది గ్రాడ్యుయేట్లు, 6 వేలమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ల పోటీ!

Ram Narayana

కుళ్లిపోయిన తల్లి మృతదేహాన్ని 3 నెలలపాటు ఇంట్లోనే ఉంచిన కొడుకు!

Ram Narayana

2025లో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన వైరల్ వంటకాలు ఇవే!

Ram Narayana