Narendra Modi
జాతీయ రాజకీయ వార్తలు

కాంగ్రెస్ ఆందోళనలపై మోడీ ఫైర్

వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుందని ఆరోపించారు. హర్యానాలోని హిస్సార్‌లో నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మాట్లాడిన మోదీ, పవిత్రమైన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆయుధంగా వాడుకుందన్నారు. అధికారం కోసం మతాన్ని వినియోగించి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ముస్లింలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? వాళ్లకు పార్టీ పదవులు, ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇవ్వలేక పోయారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. నిజంగా మద్దతు ఉంటే 50 శాతం టికెట్లు ముస్లింలకు ఎందుకు రిజర్వ్ చేయ లేదన్నారు.

Related posts

ఆయన కోతుల మధ్య కూర్చుంటే గుర్తుపట్టలేం.. యూపీ సీఎంపై అఖిలేశ్ వ్యక్తిగత వ్యాఖ్యలు

Ram Narayana

మమతా బెనర్జీ పై అధిర్ రంజన్ అనుచిత వ్యాఖ్యలు… స్పందించిన రాహుల్ గాంధీ

Ram Narayana

ఏపీ సపోర్ట్ లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉండేది కాదు: అఖిలేశ్ యాదవ్..

Ram Narayana