Narendra Modi
జాతీయ రాజకీయ వార్తలు

కాంగ్రెస్ ఆందోళనలపై మోడీ ఫైర్

వక్ఫ్ చట్టంపై కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకు పడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకుందని ఆరోపించారు. హర్యానాలోని హిస్సార్‌లో నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మాట్లాడిన మోదీ, పవిత్రమైన రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆయుధంగా వాడుకుందన్నారు. అధికారం కోసం మతాన్ని వినియోగించి ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేసిందని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ముస్లింలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? వాళ్లకు పార్టీ పదవులు, ఎంపీ లేదా ఎమ్మెల్యే టికెట్లు ఎందుకు ఇవ్వలేక పోయారని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. నిజంగా మద్దతు ఉంటే 50 శాతం టికెట్లు ముస్లింలకు ఎందుకు రిజర్వ్ చేయ లేదన్నారు.

Related posts

బీహార్ రాజకీయాల్లో ప్రకంపనలు … తిరిగి బీజేపీ చెంతకు నితీష్…!

Ram Narayana

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా

Ram Narayana

ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు బీజేపీలో లేరు: అతిషి

Ram Narayana