ప్రమాదాలు ...

తమిళనాడులో విషాదం.. బాణసంచా పేలి ఏడుగురి మృత్యువాత!


తమిళనాడులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బాణసంచా పేలుళ్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బాలురు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విరుదునగర్, సేలం జిల్లాల్లో ఈ ప్రమాదాలు సంభవించాయి. 

విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు రసాయనాల మిశ్రమాన్ని సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేలం జిల్లా కంచనాయకన్‌పట్టి గ్రామంలో ద్రౌపది అమ్మవారి ఆలయ రథోత్సవం సందర్భంగా కొందరు బాణసంచా కాల్చారు. ఆ నిప్పు రవ్వలు బైక్‌పై ఉంచిన బాణసంచా బస్తాపై పడి అంటుకున్నాయి. అందులో శక్తిమంతమైన టపాసులు పేలడంతో 11 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఢిల్లీలో కూలిన బహుళ అంతస్తుల భవనం .. శిథిలాల కింద చిక్కుకున్న నివాసితులు

Ram Narayana

ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన కాశేళ్వరం ప్రాజెక్ట్ పిల్లర్ కుంగుబాటు..

Ram Narayana

ఎయిర్ క్రాష్ : లండన్ లో ఉన్న భార్యను భారత్ తీసుకొచ్చేందుకు విమానం ఎక్కిన మాజీ సీఎం విజయ్ రూపానీ !

Ram Narayana