జాతీయ వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. ప్రధాని మోదీతో మొదటిసారి ఒమర్ అబ్దుల్లా భేటీ!

  • ప్రధాని మోదీతో అరగంట పాటు ఒమర్ అబ్దుల్లా భేటీ
  • శనివారం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో సమావేశం
  • పహల్గామ్ ఉగ్రదాడి సహా పలు అంశాలపై సంప్రదింపులు

జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం సుమారు 30 నిమిషాల పాటు కొనసాగింది.

ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా పలు కీలక అంశాలపై ప్రధానమంత్రి మోదీ, ఒమర్ అబ్దుల్లా చర్చించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పర్యాటకులే లక్ష్యంగా జరిగిన ఈ దాడి ఘటన అనంతరం నెలకొన్న పరిస్థితులు, భద్రతాపరమైన అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.

గత నెల 22వ తేదీన పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషాద సంఘటన తర్వాత ప్రధానమంత్రి మోదీ, ఒమర్ అబ్దుల్లా నేరుగా సమావేశం కావడం ఇదే మొదటిసారి.

Related posts

అల్లు అర్జున్ ముఖం చూపించాకే చెకింగ్ క్లియరెన్స్ ఇచ్చిన ఎయిర్ పోర్టు సిబ్బంది!

Ram Narayana

భారత్ లో ఓపెన్ ఏఐ తొలి ఉద్యోగిగా ప్రగ్యా మిశ్రా నియామకం…

Ram Narayana

రాష్ట్ర‌ప‌తితో సీడీఎస్‌, త్రివిధ ద‌ళాధిప‌తుల సమావేశం!

Ram Narayana