Narendra Modi
జాతీయ వార్తలు

ప్రధాని మోదీతో రక్షణ కార్యదర్శి భేటీ

  • పహల్గామ్ దాడి అనంతరం భద్రతా పరిస్థితి, సైనిక సన్నద్ధతపై చర్చ
  • పశ్చిమ సరిహద్దుల్లో తాజా పరిస్థితిని ప్రధానికి వివరించిన రక్షణ కార్యదర్శి

పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నేడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలు, సైనిక సన్నద్ధతపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాజా భద్రతా పరిస్థితి, ముఖ్యంగా పశ్చిమ సరి హద్దుల్లో సైనిక పరమైన ఏర్పాట్ల గురించి రక్షణ కార్యదర్శి ప్రధానికి వివరించినట్లు సమాచారం. ఒకేసారి బహుళ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలు, రక్షణ సరఫరాలకు అంతరాయం కలగకుండా చూసే చర్యలపై కూడా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గత వారం రోజులుగా ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులు, ఇతర ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశం జరిగిన రోజే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి, పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జపాన్ రక్షణ మంత్రి జనరల్ నకతానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉగ్రవాదంతో సహా ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌కు సహకరిస్తామని జపాన్ పునరుద్ఘాటించింది. ఇదిలావుండగా, నియంత్రణ రేఖవెంబడి పాకిస్తాన్ గత 11 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. గత రాత్రి కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరీ సహా పలు ప్రాంతాల్లో పాక్ దళాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డాయని భారత సైన్యం పేర్కొంది.

Related posts

కాంగ్రెస్ కార్యకర్తలు సింహాలు, సివంగులు: రాహుల్ గాంధీ

Ram Narayana

అజిత్ పవార్ అంతిమయాత్రలో చోరీ.. ఏడుగురి అరెస్టు…

Ram Narayana

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. బతికించిన భువనేశ్వర్ డాక్టర్లు.. వైద్య చరిత్రలోనే అరుదు!

Ram Narayana