జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై తస్లీమా సంచలన వ్యాఖ్యలు!

  • ఇస్లాం మతం ఉన్నంత వరకు ఈ ఉగ్రవాదం ఇలాగే కొనసాగుతుందన్న ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్
  • అసలు మదర్సాలు అనేవి ఉండకూడదంటూ కీలక వ్యాఖ్యలు
  • పిల్లలు ఒక పుస్తకాన్ని కాకుండా అన్ని పుస్తకాలు చదవాలి..అప్పుడే వారు ఉగ్రవాదం వైపుకు వెళ్లరన్న తస్లీమా

ఉగ్రవాదంపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ దాడిని 2016లో ఢాకాలో జరిగిన ఉగ్రదాడిగా అభివర్ణిస్తూ, ఆదివారం ఢిల్లీ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఆమె ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 1400 సంవత్సరాలు గడిచినా ఇస్లాం ఇంకా వికాసం చెందలేదని ఆమె అన్నారు. అది జరిగేంత వరకు ఉగ్రవాదులను పుట్టిస్తూనే ఉంటుందని ఆమె మండిపడ్డారు.

2016లో ఢాకాలో కల్మా చదవనందుకు ముస్లింలను దారుణంగా హత్య చేశారని ఆమె గుర్తు చేశారు. మానవత్వాన్ని, హేతుబద్ధతను విశ్వాసం అధిగమించినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఇస్లాం మతం ఉన్నంత వరకు ఈ ఉగ్రవాదం ఇలాగే కొనసాగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఐరోపా దేశాల్లో చర్చిలు ప్రదర్శనశాలలుగా మారాయని, కానీ ముస్లింలు మాత్రం ప్రతిచోటా మసీదులు కట్టడంలో నిమగ్నమై ఉన్నారని ఆమె అన్నారు. వారు జిహాదీలను ఉత్పత్తి చేస్తున్నారని, అసలు మదర్సాలు ఉండకూడదని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లలు ఒక పుస్తకాన్ని మాత్రమే కాకుండా అన్ని పుస్తకాలు చదవాలని, అప్పుడే వారు ఉగ్రవాదం వైపు వెళ్లరని తస్లీమా నస్రీన్ పేర్కొన్నారు. 

Related posts

పోర్చుగల్ వెళ్లే ప్రయత్నం.. లిబియాలో కిడ్నాపైన గుజరాత్ కుటుంబం

Ram Narayana

వందే భారత్ రైలులో నీరు లీకేజీ … స్పందించిన రైల్వే శాఖ

Ram Narayana

కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో భీకర ఎన్‌కౌంటర్.. 8 మంది సైనికులకు గాయాలు…

Ram Narayana