క్రైమ్ వార్తలు

అమ్మాయిల ఫొటోలు చూపించి హనీ ట్రాప్… మహిళ అరెస్ట్…

  • ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వెలుగు చూసిన ఘటన
  • మాధవరావు అనే వ్యక్తిని ట్రాప్‌ చేసిన తంగెళ్లబీడుకు చెందిన కనపర్తి రేణుక 
  • ఉంగరం, రూ.5వేల నగదు కాజేసి రూ.2 లక్షల డిమాండ్ చేసిన వైనం

ఇటీవల కాలంలో హానీట్రాప్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మోసాలకు గురైన బాధితులు పరువుపోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో హనీట్రాప్‌ మోసానికి పాల్పడిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. 

తంగెళ్లబీడుకు చెందిన కనపర్తి రేణుక అనే మహిళ యువతులను ఆకర్షించేలా అమ్మాయిల ఫొటోలు చూపిస్తూ వ్యక్తులను మాయలో పడేసి డబ్బులు దోచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మాధవరావు అనే వ్యక్తిని పిలిపించి అతని వద్ద నుంచి ఉంగరం, రూ.5 వేల నగదును కాజేసింది. అనంతరం అత్యాచారం కేసు పెడతానని బెదిరిస్తూ మరో రూ.2 లక్షలు డిమాండ్‌ చేసింది. 

దీంతో బాధితుడు తిరువూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, రేణుకతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అరెస్టు చేశారు. 

Related posts

హైదరాబాద్ పబ్‌లలో డ్రగ్స్ కలకలం .. నలుగురు అరెస్ట్

Ram Narayana

యూపీ సీఎం యోగిని చంపేస్తాం.. ముంబై పోలీసులకు బెదిరింపు కాల్!

Ram Narayana

లాల్ బహుదూర్ శాస్త్రి ,హోమి బాబాలను హత్య చేసింది మేమే.. అమెరికా మాజీ సి ఐ ఏ అధికారి సంచలన విషయాలు వెల్లడి

Drukpadam