Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ గురించి మాట్లాడితే అంతు చూస్తానని పార్లమెంట్ హాల్లో గోరంట్ల మాధవ్ బెదిరించారు: రఘురాజు!

జగన్ గురించి మాట్లాడితే అంతు చూస్తానని పార్లమెంట్ హాల్లో గోరంట్ల మాధవ్ బెదిరించారు: రఘురాజు!
-ఇతర ఎంపీల ముందే అసభ్యంగా మాట్లాడారన్న రఘురాజు
-సీసీకెమెరాల్లో విజువల్స్ ఉంటాయని వ్యాఖ్య
-ఆయన అవభావాలు సీసీ కెమెరా ఫుట్ ఏజ్ లో ఉంటాయని వ్యాఖ్య
-లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశానన్న రఘురాజు
-స్పీకర్ దగ్గర న్యాయం జరగకపోతే ప్రధానిని కలుస్తా

పార్లమెంటు ఆవరణలోనే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ వార్నింగ్ ఇచ్చిన అంశం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు రఘురాజు ఫిర్యాదు చేశారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే అంతు చూస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పీకర్ స్పందినచకపోతే ప్రధానికి ఫిర్యాదు చేస్తానని రఘురామ అన్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో రఘురాజు మాట్లాడుతూ, పార్లమెంటు సెంట్రల్ హాల్లో సహచర ఎంపీల ముందే తనతో అసభ్యంగా, నీచంగా గోరంట్ల మాధవ్ మాట్లాడారని రఘురాజు తెలిపారు. ఆ సమయంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారని చెప్పారు. ఇతర ఎంపీలు ఉండటంతో తాను సంయమనం పాటించానని… ఆ తర్వాత లోక్ సభ స్పీకర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనికి సంబంధించిన విజువల్స్ సెంట్రల్ హాల్లోని సీసీకెమెరాల్లో ఉన్నాయని… ఆ ఫుటేజీ చూస్తే గోరంట్ల మాధవ్ హావభావాలను వ్యక్తం చేస్తూ ఎలా మాట్లాడారో అర్థమవుతుందని చెప్పారు. ఆయన మాటలు వినిపించకపోయినా… ఆయన ఏం మాట్లాడారనే విషయాన్ని ఆయన బాడీ లాంగ్వేజ్ ద్వారా అర్థం చేసుకోవచ్చని అన్నారు.

గోరంట్ల మాధవ్ తో జగనే అలా మాట్లాడించారా? లేక జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఆయన అలా మాట్లాడారో తెలియదని రఘురాజు చెప్పారు. తన ఫిర్యాదు పట్ల స్పీకర్ సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం తనకుందని… ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే ప్రధాని మోదీని కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

Related posts

రేషన్ కార్డుల పంపిణీలో మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

Drukpadam

కాంగ్రెస్ మరో షాక్ … మాజీ కేంద్రమంత్రి జితిన్ ప్రసాద్ గుడ్ బై ,బీజేపీ లో చేరిక…

Drukpadam

పెగాసస్’తో నిఘాపెట్టారని మేం చెప్పలేదంటున్న అమ్నెస్టీ…

Drukpadam

Leave a Comment