Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

షోరూంలో అన్నీ చిల్లర నాణేలు ఇచ్చి స్కూటర్ కొనుగోలు చేసిన వ్యక్తి… 

షోరూంలో అన్నీ చిల్లర నాణేలు ఇచ్చి స్కూటర్ కొనుగోలు చేసిన వ్యక్తి… 

  • అసోంలో ఘటన
  • 8 నెలలుగా చిల్లర నాణేలు పోగుచేసిన వ్యక్తి
  • ప్రయాసపడి లెక్కించిన షోరూం సిబ్బంది
  • సోషల్ మీడియాలో వీడియో సందడి

అసోం రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేశాడు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా?… అయితే వినండి. అతడు స్కూటర్ కొనుగోలు చేసింది కరెన్సీ నోట్లతో కాదు, ఆన్ లైన్ పేమెంట్ తో అంతకన్నా కాదు. ఓ బస్తా నిండా చిల్లర నాణేలు వేసుకుని వెళ్లి షోరూంలో తనకు నచ్చిన స్కూటర్ కొనుగోలు చేశాడు. ఆ వ్యక్తి ఓ స్టేషనరీ దుకాణదారు. కొత్త స్కూటర్ కొనడం కోసం 8 నెలలుగా చిల్లర పోగు చేశాడట.

అయితే, ఆ చిల్లర లెక్కించేందుకు షోరూం సిబ్బంది కాస్త శ్రమపడాల్సి వచ్చింది. ఇతర పనులన్నీ మానుకుని ప్లాస్టిక్ ట్రేలలో వేసుకుని ఆ చిల్లర నాణేలు లెక్కించారు. ఎలాగైతేనేం… ఆ వ్యక్తి స్కూటర్ కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు లావాదేవీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Related posts

చంద్ర‌బాబు వ‌ల్లే మాదిగ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు: మంద కృష్ణ మాదిగ‌!

Drukpadam

ఏపీలో ఏఎస్సై ఆత్మహత్య.. రైలు పట్టాలపై మృతదేహం…

Ram Narayana

అనధికారిక సైరన్లు వినియోగించే వాహనాలు సీజ్ చేస్తాం: హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్…

Drukpadam

Leave a Comment