Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పద్మశ్రీ వనజీవి రామయ్యకు రోడ్ ప్రమాదం….

పద్మశ్రీ వనజీవి రామయ్య కు రోడ్ ప్రమాదం
హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
ఖమ్మం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స

పద్మశ్రీ వనజీవి రామయ్య ఈ ఉదయo రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డి గూడెంలోని తన ఇంటి నుంచి.. ఉదయం మొక్కలకు నీళ్లు పోసేందుకు బైక్పై వెల్తుండగా మరో ద్విచక్రవాహనం ఢీకొంది. రోడ్డు దాటుతుండగా జరిగిన ఈ ప్రమాదంలో కిందపడిన రామయ్య కాలుకు తీవ్ర గాయమైంది. సమాచారం తెలుసుకున్న రామయ్య కుటుంబసభ్యులు, వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఎంపీ సంతోష కుమార్ , రామయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కూడా రామయ్య కు మైరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరెంటెండెంట్ ను ఆదేశించారు .

Related posts

ఆకాశంలో ఐదు గ్రహాల అరుదైన కలయిక.. 158 ఏళ్ల తర్వాత ఇప్పుడే..

Drukpadam

ఏకధాటిగా 12 గంటల పాటు పనిచేసిన బాంబే హైకోర్టు.. 80 కేసులు విన్న ప్రత్యేక ధర్మాసనం…

Drukpadam

జైపూర్ కు మకాం మార్చిన సోనియా గాంధీ.. కారణం ఇదే!

Ram Narayana

Leave a Comment