Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే నన్ను పక్కన పెట్టారు: రేఖా నాయక్

  • ఖానాపూర్ లో తన సత్తా ఏంటో చూపిస్తానన్న ఎమ్మెల్యే
  • బీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తి
  • అగ్రవర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని విమర్శ
  • రేఖా నాయక్ కాంగ్రెస్‌లోకి వెళ్తారని జోరుగా ప్రచారం
  • ఇప్పటికే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్ భర్త

తనకు టిక్కెట్ దక్కకపోవడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఈ రోజు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 115 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఏడు చోట్ల మినహా మిగతా అన్నిచోట్లా సిట్టింగ్‌లకు అవకాశమిచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు కూడా ఈసారి టిక్కెట్ దక్కలేదు. దీంతో ఆమె పార్టీని వీడనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆమె భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో రేపు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసే అవకాశముందని తెలుస్తోంది. టిక్కెట్ పైన హామీ తీసుకొని పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే తనను పక్కన పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ మంగళవారం పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన పార్టీ అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై రేఖా నాయక్ స్పందించారు. పార్టీ ప్రకటించిన ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని ఆరోపించారు. ఖానాపూర్ లో తన సత్తా ఏమిటో చూపిస్తానని పరోక్షంగా పార్టీ అధిష్ఠానానికి సవాల్ విసిరారు. పార్టీలో, ప్రభుత్వంలో అగ్ర వర్ణాలకే పదవులు కట్టబెడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. దీనికి మరింత ఊతమిచ్చేలాగా రేఖా నాయక్ భర్త సోమవారం సాయంత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మంగళవారం ఉదయం ఎమ్మెల్యే రేఖా నాయక్ స్పందిస్తూ.. నియోజకవర్గ ప్రజలు, తన అనుచరులను సంప్రదించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు.

Related posts

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..

Ram Narayana

ములుగు అసెంబ్లీ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కేసీఆర్ ….!

Ram Narayana

తెలంగాణ ఎన్నికలు: అసంతృప్త నేతలతో త్వరలో అమిత్ షా భేటీ!

Ram Narayana

Leave a Comment