అంతర్జాతీయం

 ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీ సహా ఉత్తరాదిన ప్రకంపనలు

  • హిందూకుష్ పర్వత ప్రాంతంలో 6.1 తీవ్రతతో భూకంపం
  • 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
  • ఢిల్లీ, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లో ప్రకంపనలు

దేశ రాజధాని ఢిల్లీ… చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.1 తీవ్రతతో మధ్యాహ్నం 2.40 గంటలకు భూకంపం వచ్చింది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు ఉత్తరాదిన పలుచోట్ల భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 220 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, జమ్ము, కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోనూ భూమి కంపించింది.

Related posts

సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏమిటి?

Ram Narayana

గాజాకు సైన్యాన్ని తరలించనున్న పాకిస్థాన్… ఎందుకంటే!

Ram Narayana

అమెరికా వీసాపై కొత్త రూల్స్.. ఇకపై ఈ ఆరోగ్య సమస్యలుంటే కష్టమే!

Ram Narayana