తెలుగు రాష్ట్రాలు

ఓటుకు నోటు కేసు… ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు

21-08-2024 Wed 15:14 | Both States

  • ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన ఆళ్ల
  • రాజకీయ కక్షలకు కోర్టును వేదికగా చేసుకోవద్దని సుప్రీంకోర్టు సూచన
  • విచారణ జరిపిన జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం

ఓటుకు నోటు కేసులో వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో సీబీఐ విచారణను కోరుతూ ఆయన పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

రాజకీయంగా కక్షలు ఉంటే బయట చూసుకోవాలని… కోర్టులను వేదికగా చేసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

దాదాపు పదేళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఆళ్ల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాఫ్తును సీబీఐకి అప్పగించాలని వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేసింది.

Related posts

చంద్రబాబును కలిసిన తర్వాత వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Narayana

తుంగభద్ర నదిలో హైదరాబాద్ యువ వైద్యురాలి గల్లంతు!

Ram Narayana

అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా ‘సంక్రాంతి అల్పాహార విందు’…

Ram Narayana