అంతర్జాతీయం

42 మంది కార్మికులను చిదిమేసిన బంగారు గని…

  • ఆఫ్రికా దేశం మాలిలో దుర్ఘటన
  • ఒక్కసారిగా విరిగిపడిన కొండచరియలు
  • తప్పించుకునేలోపే మృత్యువాత పడిన కార్మికులు

ఓ బంగారు గని కుప్పకూలిన ఘటన ఆఫ్రికా దేశం మాలిలో చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 42 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మాలి దేశంలోని తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ గని కొందరు చైనా జాతీయులు నిర్వహణలో ఉంది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. 

కొన్ని రోజుల వ్యవధిలోనే మాలి దేశంలో జరిగిన రెండో ప్రమాదం ఇది. గత నెల 29న కౌలికోరో ప్రాంతంలో ఉన్న ఓ బంగారు గని కూలిపోయిన ఘటనలోనూ ప్రాణనష్టం జరిగింది. 

మాలి దేశం ఆఫ్రికాలోని మూడో అతి పెద్ద బంగారం ఉత్పత్తిదారుగా ఉంది. ఇక్కడి జనాభాలో 10 శాతం కంటే ఎక్కువమంది గనులపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నారు. గతేడాది కూడా మాలిలో ఓ బంగారు గని కుప్పకూలి 70 మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడి గనుల్లో చాలా వరకు అనుమతులు లేనివే ఉంటాయని తెలుస్తోంది.

Related posts

మాల్దీవుల పశ్చాత్తాపం.. భారత్ పై ఇంకెప్పుడు అలాంటి వ్యాఖ్యలు పునరావృతం కావంటూ హామీ

Ram Narayana

హౌతీల ప్రధానమంత్రిని హతమార్చిన ఇజ్రాయెల్…

Ram Narayana

ఖలిస్థానీలతో దోస్తీ వద్దు.. భారత్‌తో స్నేహానికి అదే మార్గం: కెనడాకు మాజీ ప్రధాని కీలక సలహా

Ram Narayana