Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ హైకోర్టు వార్తలు

ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో పిల్!

  • పిల్ దాఖలు చేసిన నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ 
  • ప్రమాదం జరిగి పది రోజులవుతున్నా కార్మికుల ఆచూకీ లేదని వెల్లడి
  • ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి

ఎస్ఎల్‌బీసీ సొరంగం ప్రమాదంపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా తీసుకురావాలంటూ నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ పిల్‌ను దాఖలు చేసింది. ప్రమాదం జరిగి పది రోజులవుతున్నప్పటికీ కార్మికుల ఆచూకీ లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.

తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. టన్నెల్ సహాయక చర్యల్లో ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఇరవై నాలుగు గంటలు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. సహాయక చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కోర్టుకు తెలిపారు. అడ్వొకేట్ జనరల్ తెలిపిన వివరాలను నమోదు చేసిన హైకోర్టు పిల్‌పై విచారణను ముగించింది.

Related posts

రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు… బీజేపీ నేత వాంగ్మూలం నమోదు చేసిన కోర్టు..!

Ram Narayana

ఎన్నిసార్లు చెప్పినా తీరు మారదా? అలా చేస్తే హైడ్రాను మూసివేయాల్సి ఉంటుంది: హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Ram Narayana

తగిన సమయంలో నిర్ణయం తీసుకోండి …ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు

Ram Narayana

Leave a Comment