ఖమ్మం వార్తలు

సిపిఐ జాతీయ మహాసభలకు ఖమ్మం ప్రతినిధులు

సిపిఐ జాతీయ మహాసభలకు ఖమ్మం ప్రతినిధులు

పంజాబ్ లోని మొహలీలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ 25వ మహాసభలకు ఖమ్మం జిల్లా ప్రతినిధి వర్గం శనివారం బయలుదేరి వెళ్లింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు నేతృత్వంలో వీరంతా చండీఘర్ మహాసభలకు ప్రతినిధులుగా వెళ్లారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఎస్ కె జానిమియా, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో వీరు పాల్గొననున్నారు.

Related posts

పేదోడి ఇల్లు కంటే ‘కాళేశ్వరం’ కమిషన్లే ముఖ్యం అనుకున్నారు..!

Ram Narayana

మైరా మురిపెంలో.. పరమశివుని చెంత మంత్రి పొంగులేటి దంపతులు

Ram Narayana

జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల

Ram Narayana