సీపీఎంపై మధిర నియోజకవర్గ కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణలు
రక్తపాతానికి మారుపేరు సిపిఎం అంటూ విమర్శలు
విలువలు కలిగిన నేతలకు సీపీఎంలో స్థానం లేదన్ననేతలు
రక్తం పారే ప్రాంతంలో నీళ్లు పారిస్తున్న అపరభగీరథుడు భట్టి విక్రమార్కఅంటూ ప్రశంశలు
హత్యా రాజకీయాలకు కేంద్రంగా సీపీఎం ఉందని ధ్వజం
విలేకర్ల సమావేశంలో పాల్గొన్నా ఐదు మండలాల అధ్యక్షులు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పై సిపిఎం పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు,స్థానిక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, చింతకాని మండల అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు,ముదిగొండ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు,ఏర్రుపాలెం మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఎం ముఠా రాజకీయాలు నచ్చకనే దూరం పెట్టిన ప్రజలు సామినేని హత్యలో సూత్రధారులు,పాత్రధారులు ఎంతో కాలం దాక్కోలేరన్నారు,ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో హత్యా రాజకీయాలను ప్రేరేపించి రక్తపాతాన్ని సృష్టించేది సీపీఎం నేతలేన్నారు,రక్తపాతానికి మారుపేరు సీపీఎం అని, మిమ్ములను మీరే చంపుకొని,మీ కార్యకర్తలను మీరే కేసుల్లో ఇరికించి దశాబ్దాల పాటు రాజకీయం పబ్బం గడుపుకునే సంస్కృతి సీపీఎం నేతలదని వారన్నారు,ఈ తరహా రాజకీయాలతో జిల్లా ప్రజలు, మీ పార్టీ కేడర్ విసిగి వేసారి మిమ్ములను ఛీ కొట్టి మూలన కూర్చోబెట్టారని, ఇదే తరహాలో మీరు హత్యా,కుట్ర రాజకీయాలకు పాల్పడితే ప్రస్తుతం పిడికెడు గ్రామాల్లో ఉన్న ఈ కొద్దీ బలం కూడా కనుమరుగు అవుతుంది తస్మాత్ జాగ్రత్తన్నారు,ఈ తరహా రాజకీయాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమన్నారు,సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్ తన స్వగ్రామమైన బోనకల్లు మండలం నారాయణపురంలోనే పార్టీ అభ్యర్థిని సర్పంచ్ గా గెలిపించుకోలేకపోయారని ఇదొక్క ఉదాహరణ చాలు మధిర నియోజకవర్గంలో మీకున్న ప్రజాదరణ ఎలాంటిదో తెలిసిపోతుందన్నారు.
పాతర్లపాడుకు చెందిన సామినేని రామారావుగారు ఓ మంచి నేత శాంతి కామకుడు. మీ దుర్మార్గపు హత్యా రాజకీయాలు భరించలేక సామినేని రామారావుగారు, మీ నుంచి చాలా దూరంగా ఉన్నారన్న సంగతి నియోజకవర్గ ప్రజలకు, మీ పార్టీ కేడర్ కు స్పష్టంగా తెలుసు. మీ పార్టీలో విలువలు కలిగిన నేతలు మీ సెటిల్మెంట్, కిరాయి, హత్య రాజకీయాలు నచ్చక దూరంగా వెళ్లిపోయిన సంగతి నియోజకవర్గమంతా తెలుసనని అన్నారు.
సీపీఎం అంటే హత్యారాజకీయాలకు రక్తపాతానికి మారుపేరుగా మారింది. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో హింసాత్మక ఘట నలనే ప్రేరేపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ.. ఆర్థిక దోపిడీకి సీపీఎం నాయకులు కేంద్రంగా మారారు. సీపీఎం అంటేనే మాఫియా ముఠాలా చెలరేగిపోతున్నారు.
సామినేని రామారావుగారి హత్యలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అనేది తేలేవరకు మాట్లాడవద్దన్న ఏకైక లక్ష్యంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారు మౌనంగా ఉన్నారని తెలిపారు,రామారావు హత్యలో పాల్గొన్న దోషులు ఎంతో కాలం తప్పించుకు తిరుగు లేరని,సీపీఎం పార్టీ కోసం దశాబ్దాలుగా ఆస్తులు అమ్ముకొని విలువలు కట్టుబడి రాజకీయాలు చేస్తున్న వారిని పక్కన పెట్టారన్నారు,అదే సమయంలో నేర చరిత్ర, హత్య రాజకీయాలు, గతంలో పనిచేసిన పార్టీలో నిధుల దోపిడీ, ఆ పార్టీ నుంచి బహిష్కరణ చరిత్ర కలిగిన ఇతర జిల్లాల నుంచి వచ్చిన నున్నా నాగేశ్వరరావు నేర చరిత్ర కలిగిన బండి రమేష్ వంటి వ్యక్తులకు పార్టీ కీలక పదవులు కట్టబెట్టారంటే సీపీఎం పార్టీలో విలువలు ఏ మేరకు ఉన్నాయో అర్థమవుతుందన్నారు,అభివృద్ధికి ఆమడ దూరంలో, నిత్యం హత్యా రాజకీయాలు, దొమ్మీలు, పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించిన మహా నాయకుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు,గాంధీ మహాత్ముడు చూపించిన శాంతి మార్గాన్ని ఎంచుకొనీ మధిర నియోజకవర్గమే తన రాజకీయ క్షేత్రంగా మార్చుకున్న దీశాలి భట్టి విక్రమార్క,అభివృద్ధి ఆయుధంగా చేసుకొని కాలికి బలపం కట్టుకొని పల్లె పల్లెకు తిరిగి 20 ఏళ్ల వ్యవధిలో రాష్ట్రంలోనే మధిర నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దిన ఘనత భట్టి విక్రమార్కకుదక్కుతుందన్నారు,ఈరోజు మధిర నియోజకవర్గంలో పల్లె పల్లెన రహదారులు, పరిశుభ్రమైన తాగునీరు,సాగునీటి వసతి,ఉన్నత విద్యాసంస్థల తో అభివృద్ధికి మారుపేరుగా విలసిల్లుతుంది అంటే అది కేవలం భట్టి విక్రమార్క గారి కృషి మాత్రమేన్నారు,ఒకనాడు గొడవలు,ఘర్షణలు, కక్ష్య పూరిత మధిరను అభివృద్ధిలోకి నడిపించారు. కక్ష్యపూరిత రాజకీయల నుంచి మధిరను ఆదర్శవంతమైన ప్రాంతంగా మలిచారని,ప్రతి గ్రామానికి రోడ్లు,తాగు,సాగు నీరు అందించి ప్రతి చేతికి పని కల్పించి.. ఆర్థిక సాధికరత సాధించేలా ప్రణాలికలు అమలు చేసిన దార్శనిక నాయకత్వం భట్టి విక్రమార్కదన్నారు.ప్రతి పొలానికి నీళ్లు అందితే.. ఏడాదంతా వ్యవసాయం నడిస్తే..పగలు,ప్రతీకారాలు, గొడవలు,ఘర్షణ లేని వాతావర ణం ఏర్పడి ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందని దార్శనికంగా ఆలోచన చేసి నదులు, ఏరులుపై ఆనకట్టలు కట్టిన అభినవ కాటన్ మన భట్టి విక్రమార్క అని అన్నారు,సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చిన్న పోలీసు కేసు కూడా నమోదు కాని,మచ్చలేని విలువలు కలిగిన రాజకీయ జీవితం భట్టి విక్రమార్కదనీ పత్రికా సమావేశంలో తెలియజేశారు.ఈ సమావేశంలో పిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్,చింతకాని మండల కిసాన్ సెల్ అధ్యక్షులు కోప్పుల గోవిందరావు,మధిర మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుడేటి బాబురావు,ఎర్రుపాలెం మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తల్లపురెడ్డి నాగిరెడ్డి,కృష్ణాపురం మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు,తూటికుంట్ల సర్పంచ్ తుల్లూరి లక్ష్మీనరసయ్య,రావినూతల సర్పంచ్ భూక్యా భద్రు నాయక్, మాజీ కో ఆప్షన్ సభ్యులు జమాలుద్దీన్ తదితరులు ఉన్నారు.