తెలంగాణ వార్తలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి సోదరుడికి సిట్ నోటీసులు…

  • తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు
  • రేపు విచారణకు రావాలంటూ కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
  • బీఆర్ఎస్ హయాంలో కొండల్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్టు దర్యాప్తులో తేలిన వైనం

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత సోదరుడు కొండల్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) నోటీసులు పంపింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో అధికారులు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లో కొండల్ రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేశారని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన వాంగ్మూలం తీసుకోవడం కోసం విచారణకు పిలుస్తున్నారు.

ఇదే కేసులో మరో ఇద్దరు బీఆర్‌ఎస్ నేతలకూ నోటీసులు వెళ్లాయి. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను కూడా రేపు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావులకు కూడా ఇలాంటి నోటీసులు జారీ అయ్యాయి.

Related posts

చివర గింజ వరకు కొంటాం…మంత్రి పొంగులేటి

Ram Narayana

రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు ఎలాంటి గ్యాప్ లేదు …గవర్నర్ తమిళశై…!

Ram Narayana

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఆదరించండి …ఆధార్ పార్టీ అధ్యక్షులు ఈడా శేషగిరి రావు …

Ram Narayana